ఓటీటీకీ సిద్ధమవుతున్న నిఖిల్ సిద్ధార్థ్ "కార్తికేయ-2"

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (16:35 IST)
టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం "కార్తికేయ-2". ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించారు. ఆగస్టు 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైంది. ఇది తెలుగు, తమిళం కంటే హిందీలో భారీ కలెక్షన్లు రాబట్టింది. 
 
సరైన బాలీవుడ్ చిత్రాలు లేకపోవడంతో తెలుగులో నిర్మితమై డబ్బింగ్ మూవీగా విడుదలైన "కార్తికేయ-2" సంచలన విజయాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్లలో భారీ కలెక్షన్లతో ఆడుతోంది. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత 2014లో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్. 
 
ప్రపంచ వ్యాప్తంగా రూ.120 కోట్లను వసూలు చేయగా, ఇందులో రూ.60 కోట్ల షేర్ సాధించి రికార్డు సృష్టించింది. అయితే, ఈ చిత్రం విడుదలై నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతుంది. సెప్టెంబర్ 30వ తేదీన జీ5 ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Karnataka: 13 ఏళ్ల బాలికను చెరకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

జనాభా పెంచేందుకు చైనా వింత చర్య : కండోమ్స్‌లపై 13 శాతం వ్యాట్

అపుడు నన్ను ఓడించారు... ఇపుడు నా భార్యను గెలిపించండి...

భాగ్యనగరిలో వీధి కుక్కల బీభత్సం - ఎనిమిదేళ్ళ బాలుడిపై దాడి

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments