Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీకీ సిద్ధమవుతున్న నిఖిల్ సిద్ధార్థ్ "కార్తికేయ-2"

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (16:35 IST)
టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం "కార్తికేయ-2". ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించారు. ఆగస్టు 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైంది. ఇది తెలుగు, తమిళం కంటే హిందీలో భారీ కలెక్షన్లు రాబట్టింది. 
 
సరైన బాలీవుడ్ చిత్రాలు లేకపోవడంతో తెలుగులో నిర్మితమై డబ్బింగ్ మూవీగా విడుదలైన "కార్తికేయ-2" సంచలన విజయాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్లలో భారీ కలెక్షన్లతో ఆడుతోంది. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత 2014లో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్. 
 
ప్రపంచ వ్యాప్తంగా రూ.120 కోట్లను వసూలు చేయగా, ఇందులో రూ.60 కోట్ల షేర్ సాధించి రికార్డు సృష్టించింది. అయితే, ఈ చిత్రం విడుదలై నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతుంది. సెప్టెంబర్ 30వ తేదీన జీ5 ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.

 

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments