Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రూ.వంద కోట్ల క్లబ్ దిశగా నిఖిల్ సిద్ధార్థ్ "కార్తికేయ-2"

karthikeya-2
, మంగళవారం, 23 ఆగస్టు 2022 (13:58 IST)
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం "కార్తికేయ-2". ఈ నెల 13వ తేదీన విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరభారతంలో కూడా సంచలన విజయాన్ని నమోదు చేసుకుని, సూపర్ హిట్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. హిందీలో ఇప్పటికే రూ.15 కోట్ల మేరకు వసూళ్లు రాబట్టి, ప్రపంచ వ్యాప్తంగా రూ.75 కోట్ల మేరకు కలక్షన్లు వసూలు చేసింది.
 
అభిషేక్ అగర్వాల్, విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఒక రహస్యం చుట్టూ కథ తిరుగుతుంది. ఆ రహస్యం ఏంటన్నది తెలుసుకోవడానికి ద్వారకలో హీరో సాగించే అన్వేషణే ఈ సినిమా పూర్తి స్టోరీ. 
 
విడుదలైన తొలి రోజే మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నార్త్‌లో ఈ సినిమాకు అనూహ్యమైన స్పందన వచ్చింది. తొలి రోజుఅక్కడ 200 థియేటర్లలో విడుదల కాగా, మూడో రోజుకు ఈ థియేటర్ల సంఖ్య 700కి చేరింది. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కలెక్షన్ల వర్షం కురిపించింది. 
 
ఇప్పటివరకు ఒక్క హిందీలోనే రూ.15 కోట్లు రాబట్టగా, ప్రపంచ వ్యాప్తంగా రూ.75.33 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. దీంతో త్వరలోనే ఈ చిత్రం రూ.100 కోట్ల మార్క్‌ను టచ్ చేసే చేయడం ఖాయమని సినీ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. కాగా, హీరో నిఖిల్ సిద్ధార్థ్ సినిమా కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోవాలో గుండెపోటుతో మరణించిన నటి సోనాలి ఫోగట్