Webdunia - Bharat's app for daily news and videos

Install App

"టాక్సిక్" కోసం వందలాది చెట్లను నరికేసారు.. కేజీఎఫ్ హీరోపై కేసు

సెల్వి
మంగళవారం, 12 నవంబరు 2024 (18:16 IST)
Yash
బెంగళూరులో సూపర్‌స్టార్‌ యష్ నటించిన "టాక్సిక్" సినిమా షూటింగ్‌ కోసం వందలాది చెట్లను నరికిన ఘటనపై కర్ణాటక అటవీ శాఖ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కోర్టు నుంచి సమ్మతి పొందిన తర్వాతే ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్, హెచ్ఎంటీ జనరల్ మేనేజర్‌లను ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా పేర్కొన్నారు.
 
టాక్సిక్ సినిమా షూటింగ్ కోసం బెంగళూరులోని హెచ్‌ఎంటీకి చెందిన భూమిలో చెట్ల నరికివేతకు సంబంధించి చర్యలు తీసుకుంటామని కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే గతంలో ప్రకటించారు. ‘టాక్సిక్’ సినిమా చిత్రీకరణ కోసం హెచ్‌ఎంటీ ఆధీనంలోని అటవీ భూమిలో అక్రమంగా వందలాది చెట్లను నరికివేయడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని మంత్రి ఖండ్రే అన్నారు. 
 
ఈ చట్టవిరుద్ధమైన చర్యను శాటిలైట్ చిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయని తెలిపారు. "నేను ఈ రోజు తనిఖీ కోసం సైట్‌ను సందర్శించాను. ఈ నేరానికి బాధ్యులైన వారిపై తక్షణం కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను ఆదేశించాను" అని ఖండ్రే చెప్పారు. సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించానని.. ఏరియల్ సర్వే చిత్రాలు కూడా నిర్ధారించాయని వెల్లడించారు. అటవీ చట్టం 24 ప్రకారం కేసు నమోదు చేయడానికి నిబంధన ఉందని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ చేసిన తప్పును ఫేక్ వీడియోతో మభ్యపెట్టడం దారుణం : వైఎస్ షర్మిల

రాజకీయ ముసుగులో ఉన్న కరుడుగట్టిన నేరస్థుడు జగన్ : హోం మంత్రి అనిత

మేఘాలయ హానీమూన్ హత్య కేసు : కీలక ఆధారాలు దాచేసిన ఫ్లాట్ యజమాని

మా బూట్లు నాకడానికి కూడా నవ్వు పనికిరావు... ఇంటికెళ్లి చెప్పులు కుట్టుకోపో...

Andhra liquor scam: వైకాపాకు కొత్త తలనొప్పి.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సమన్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments