Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నడ నటి రాగిణి ద్వివేదికి ఊరట.. బెయిల్ మంజూరు

Webdunia
గురువారం, 21 జనవరి 2021 (16:34 IST)
మాదకద్రవ్యాల వినియోగం కేసులో జైలుకు వెళ్లిన కన్నడ నటి రాగిణి ద్వివేదికి ఊరట లభించింది. ఈ కేసులో భాగంగా ఆమెకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు గురువారం తీర్పునిచ్చింది. గతేడాది సెప్టెంబరులో.. ఓ డ్రగ్స్ పెడ్లర్తో నటి రాగిణి ద్వివేదికి సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి.
 
డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న నేపథ్యంలో మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద అక్టోబరులో ఆమెను అరెస్టు చేసి.. జైలుకు తరలించారు. ఆమెతో సహా ఈ కేసుకు సంబంధం ఉన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
అయితే, తన దగ్గర డ్రగ్స్కు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని అంటున్న సదరు నటి.. బెయిల్ కోసం నవంబరు 3న కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ ఆమెకు చుక్కెదురవ్వడం వల్ల.. ఆ తీర్పును సవాలు చేస్తూ, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో గురువారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. వాదనలు విన్న ధర్మాసనం.. రాగిణికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈవీఎం బ్యాలెట్ పత్రాల్లో అభ్యర్థుల కలర్ ఫోటోలు : ఎన్నికల కమిషన్

పార్టీ బలోపేతంపై దృష్టిసారించండి... ఎమ్మెల్యేలకు జనసేనాని ఆర్డర్

మందలించిన తల్లి.. కత్తితో గొంతుకోసి చంపేసిన కిరాతక బీటెక్ కొడుకు

తమిళనాడుకు వర్ష సూచన - 12 జిల్లాల్లో కుండపోత వర్షం

పెళ్లి పేరుతో నమ్మంచి వాడుకుని వదిలేశాడు.. భరించలేక ప్రాణాలు తీసుకున్న యువతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments