Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నడ నటి రాగిణి ద్వివేదికి ఊరట.. బెయిల్ మంజూరు

Webdunia
గురువారం, 21 జనవరి 2021 (16:34 IST)
మాదకద్రవ్యాల వినియోగం కేసులో జైలుకు వెళ్లిన కన్నడ నటి రాగిణి ద్వివేదికి ఊరట లభించింది. ఈ కేసులో భాగంగా ఆమెకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు గురువారం తీర్పునిచ్చింది. గతేడాది సెప్టెంబరులో.. ఓ డ్రగ్స్ పెడ్లర్తో నటి రాగిణి ద్వివేదికి సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి.
 
డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న నేపథ్యంలో మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద అక్టోబరులో ఆమెను అరెస్టు చేసి.. జైలుకు తరలించారు. ఆమెతో సహా ఈ కేసుకు సంబంధం ఉన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
అయితే, తన దగ్గర డ్రగ్స్కు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని అంటున్న సదరు నటి.. బెయిల్ కోసం నవంబరు 3న కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ ఆమెకు చుక్కెదురవ్వడం వల్ల.. ఆ తీర్పును సవాలు చేస్తూ, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో గురువారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. వాదనలు విన్న ధర్మాసనం.. రాగిణికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments