Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాలా కంఫర్టుగా ఉండే ప్రదేశం అదొక్కటే : కంగనా రనౌత్

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (12:05 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత బయోపిక్‌లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తున్నారు. కరోనా లాక్డౌన్ తర్వాత ఈ చిత్రం షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. ఈ చిత్రం షూటింగ్ కోసం ఆమె చెన్నైకు వచ్చి, షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఆదివారం జరిగిన షూటింగ్‌లో ఆమె పాల్గొంది. ఈ విషయాన్ని కంగనా తెలియజేస్తూ డైరెక్టర్‌ ఎ.ఎల్‌.విజయ్‌ తనకు సీన్‌ వివరిస్తున్న ఫొటోను షేర్‌ చేశారు. 
 
'టాలెంటెడ్‌ డైరెక్టర్‌ ఎ.ఎల్‌.విజయ్‌ నాకు సీన్‌ను వివరిస్తున్నారు. ఈ ప్రపంచంలో అద్భుతమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. కానీ చాలా కంఫర్ట్‌ అయిన ప్రదేశం ఏదైనా ఉందంటే అది ఫిలింసెట్‌ మాత్రమే' అని తన ట్విట్టర్ ఖాతాలో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. 
 
కాగా, బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ నెపోటిజం, డ్రగ్‌ మాఫియా తదితర అంశాలపై కంగనా రనౌత్‌ తనదైనశైలిలో స్పందించారు. దీంతో మహారాష్ట్రలోని అధికార శివసేన పార్టీ నేతలతో ఆమెకు వైరం ఏర్పడటంతో ముంబైను పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో ఆమె పోల్చారు. ఈ వ్యాఖ్యలను జీర్ణించుకోలేని శివసేన నేతలు కంగనా రనౌత్ సినీ కార్యాలయాన్ని కూల్చివేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలిక గొంతుకోసి ఆత్మహత్య చేసుకున్న యువకుడు...

మాదన్నపేటలో వృద్ధురాలిపై దాడి చేయించిన కానిస్టేబుల్

wolf attack: తోడేళ్ల దాడి.. పంట పొలాల గుడిసెలో నిద్రిస్తున్న దంపతుల మృతి

బాలకృష్ణకి మెంటల్ వచ్చి తుపాకీతో కాలిస్తే వైఎస్సార్ కాపాడారు: రవీంద్రనాథ్ రెడ్డి (video)

కడపలో వైకాపా రూల్ : వైకాపా కార్యకర్తలపై కేసు పెట్టారని సీఐపై బదిలీవేటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments