Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ నాలుగో సీజన్- గంగవ్వ చాడీల చిట్టానా?

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (10:46 IST)
బిగ్ బాస్ నాలుగో సీజన్ రసవత్తరంగా జరుగుతోంది. శనివారం నాటి ఎపిసోడ్‌లో స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. మూడో వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి వెళ్లిన స్వాతి.. ఒక్క వారానికే ఇంటి బాట పట్టింది. అమ్మ రాజశేఖర్ మాస్టర్ స్వాతిని ఎలిమినేషన్‌కి నామినేట్ చేయగా.. ఆమె ఆటతీరు పెద్దగా బాలేదంటూ ప్రేక్షకులు కూడా వ్యతిరేకంగా ఓట్లు వేశారు. దీంతో స్వాతి బయటకు వచ్చేసింది.
 
ఈ క్రమంలో ఆదివారం నాటి ఎపిసోడ్‌లో స్వాతిని స్టేజీపైకి పిలిచిన నాగార్జున, ఆమెతో ఆట ఆడించారు. ఈ క్రమంలో కార్డులపై కొన్ని లక్షణాలు రాసి.. ఆ లక్షణం హౌజ్‌లో ఏ వ్యక్తికి సెట్ అవుతుందో చెప్పి దానికి కారణం చెప్పాలని నాగార్జున సూచించారు.
 
ఈ సందర్భంగా కుమార్‌ సాయిని నక్కతోక తొక్కిన వ్యక్తిగా స్వాతి పేర్కొన్నారు. అతడు చాలా టాలెంటెడ్ అని, కానీ వెనుక నుంచి ఎవరైనా తోస్తే తప్ప తన టాలెంట్‌ని బయట పెట్టరని అన్నారు. ఇక అన్నం పెట్టిన అమ్మ రాజశేఖర్ మోసం చేశారని.. అతడు నమ్మకద్రోహి అని తెలిపారు.
 
ఇక సుజాతను పుకార్ల పుట్టగా, సోహైల్‌ని దొంగగా, లాస్యను అవకాశవాదిగా, నోయల్‌ను గుడ్డిగా నమ్మే వాడిగా, మోనాల్‌ని ఏమార్చే వ్యక్తిగా, మెహబూబ్‌ని అనుసరించే వ్యక్తిగా వెల్లడించారు. అలాగే అరియానా ఓవర్ కాన్ఫిడెన్స్ అని, హారిక ట్యూబ్‌లైట్ అని, అభిజిత్ అహంకారి అని, గంగవ్వ చాడీల చిట్టా అని, అఖిల్ గమ్యం లేని వ్యక్తి అని తెలిపారు.
 
కాగా హౌజ్‌లో అవినాష్ తన ఫేవరెట్‌ అని స్వాతి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తన ఎలిమినేషన్‌కి కారణమైన అమ్మ రాజశేఖర్ మాస్టర్‌ కెప్టెన్సీ రేసులో పాల్గొనడానికి వీలు లేదని అతడిపై స్వాతి బిగ్‌బాంబ్ వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments