Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ రంగంపై వివక్ష చూపుతున్న మహారాష్ట్ర సర్కారు : కంగనా ఫైర్

Webdunia
ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (11:14 IST)
సినీ రంగంపై మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వివక్ష చూపుతోందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆరోపించారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గిందనీ, దీంతో పలు రాష్ట్రాలు సినియా థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చాయని, కానీ మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉద్దేశ్యపూర్వకంగానే థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వలేదని కంగనా ఆరోపిస్తున్నారు. 
 
దేశంలో క‌రోనా తగ్గుముఖం పట్ట‌డంతో అనేక‌ రాష్ట్రాలు థియేటర్లను తెరుచుకునేందుకు అనుమతినిచ్చాయి. మహారాష్ట్ర ప్ర‌భుత్వం మాత్రం ఇందుకు అంగీక‌రించ‌పోవ‌డం సరికాద‌ని, సినీరంగంపై ఆ రాష్ట్ర స‌ర్కారు వివక్ష చూపుతోందని ఆమె ఆరోప‌ణ‌లు గుప్పించారు. 
 
ఇప్ప‌టికే చాలా సినిమాలు విడుదలకు సిద్ధ‌మ‌య్యాయ‌ని ఆమె అన్నారు. థియేటర్లు తెర‌వ‌డానికి ఒప్పుకోకుండా వాటిని పూర్తిగా మూసేయాలని ఆ రాష్ట్ర స‌ర్కారు భావిస్తోంద‌ని ఆరోపించారు.
 
మ‌హారాష్ట్ర పభుత్వం సినీ పరిశ్రమని వివక్షతో చూస్తున్నప్పటికీ దీనిపై ఎవరూ మాట్లాడ‌క‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌ని చెప్పారు. కాగా, కంగ‌నా ర‌నౌత్ న‌టించిన‌ ‘తలైవి’ సినిమా విడుద‌ల నేప‌థ్యంలోనూ మ‌హారాష్ట్ర‌లో ప్ర‌భుత్వం థియేట‌ర్ల‌ను తెర‌వడానికి అనుమ‌తులు ఇవ్వ‌ని పరిస్థితి తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టూరిస్ట్ సైట్స్ చూపిస్తానని నమ్మించి.. ఫ్రెంచ్ పర్యాటకురాలిపై అత్యాచారం..

కూటమి ప్రభుత్వ పాలన అద్భుతంగా వుంది, తిరుమల శ్రీవారు కళకళ: శివాజి

చెన్నైలో పవన్ ఒక్క నియోజకవర్గంలో పోటీ చేసి గెలిస్తే.. ఆయన చెప్పింది వింటాం..

ఇజ్రాయెల్ - ఇరాన్‌లు కాల్పుల విరమణ - దిగివచ్చిన క్రూడ్ ఆయిల్ ధరలు

మాజీ సీఎం జగన్‌పై మరో కేసు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments