Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్టర్ ఉద్ధవ్ ఠాక్రే.. ఎన్ని గొంతులను మీరు నొక్కిపెట్టగలరు : కంగనా రనౌత్

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2020 (12:56 IST)
హిందీ చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ నటి కంగనా రనౌత్‌కు, మహారాష్ట్రలోని అధికార శివసేన పార్టీకి మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. బుధవారం హర్యానా రాష్ట్రం నుంచి ముంబైకి చేరుకునే లోపే మహారాష్ట్ర సర్కారు ఒత్తిడిమేరకు బీఎంసీ అధికారులు మణికర్ణిక కార్యాలయాన్ని కూల్చివేశారు. ఈ చర్యపై కంగనా అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఆ తర్వాత శివసేనపై, ఉద్ధవ్‌ ఠాక్రేలపై వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. 
 
గురువారం కూడా మరోమారు సీఎం ఉద్ధవ్‌ను లక్ష్యంగా చేసుకుని కంగనా విమర్శల తూటాలు పేల్చారు. 'మీ తండ్రి చేసిన మంచి పనులు మీకు సంపదనిచ్చాయి.. కానీ మీ గౌరవం మీరే సంపాదించుకోవాలి. మీరు నా నోరు మూయించగలరు, కానీ నా గొంతు వంద మిలియన్లలో ప్రతిధ్వనిస్తుంది. ఎంత మంది నోర్లు మీరు మూయించగలరు? ఎన్ని గొంతులను మీరు నొక్కిపెట్టగలరు? మీరు ఎప్పుడైతే నిజం నుంచి తప్పించుకోవాలని చూస్తారో.. మీరు రాజవంశానికి నమూనాగా మిగిలిపోతారు తప్ప ఇంకేమీ కారు' అని ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి కంగనా ట్వీట్ చేశారు. 
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments