Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలైవిని థియేటర్లలోనే విడుదల చేస్తాం .. కంగనా రనౌత్

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (14:26 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం తలైవి. ఏఎల్.విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టైటిల్ రోల్‌ను బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోషించారు. ఏప్రిల్ 23వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే, కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతితో చిత్రం విడుదల వాయిదా పడింది.
 
ఈ నేపథ్యంలోనే సినిమాపై పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. నేరుగా ఓటీటీలోనే విడుదల చేసేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై క్వీన్ కంగనా ఫైర్ అయింది. ఆ వ్యాఖ్యలపై ఆమె స్పష్టతనిచ్చింది. సినిమా థియేటర్లలో విడుదలైన తరువాతే ఓటీటీలోకి వస్తుందని తేల్చి చెప్పారు. 
 
'తలైవి తమిళ వెర్షన్ హక్కులను అమెజాన్ ప్రైమ్, హిందీ హక్కులను నెట్ ఫ్లిక్స్‌లు సొంతం చేసుకున్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని బాలీవుడ్‌‌లోని కొందరు వ్యక్తులు సినిమాను నేరుగా ఓటీటీలోనే విడుదల చేస్తారంటూ కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 
 
వీరితో పాటు ప్రతి ఒక్కరికీ చెప్పేదేంటంటే, సినిమాను థియేటర్లలో రిలీజ్ చేశాకే ఓటీటీలోకి తీసుకొస్తాం. నిజమేంటో తెలుసుకోకుండా తప్పుడు కథనాలు ప్రచురించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం' అని ఆమె హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాకు పాకిన బర్డ్ ఫ్లూ.. డజను కోడిగుడ్ల ధర రూ.800పైనే.. చికెన్ ధరలకు రెక్కలు

రూ.15 కోట్లు పెట్టిన ప్యాన్సీ నంబర్ కొన్నాడు... ఎక్కడ?

భార్యకు మెసేజ్‌లు పంపుతున్నాడని యువకుడి కుడిచేతిని నరికేసిన భర్త..

వరిపొలంలో మొసలి.. బెంబేలెత్తిపోయిన రైతులు - కూలీలు (Video)

విమానాశ్రయంలో తిరగగబడిన విమానం.. వీడియో దృశ్యాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments