Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలైవిని థియేటర్లలోనే విడుదల చేస్తాం .. కంగనా రనౌత్

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (14:26 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం తలైవి. ఏఎల్.విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టైటిల్ రోల్‌ను బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోషించారు. ఏప్రిల్ 23వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే, కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతితో చిత్రం విడుదల వాయిదా పడింది.
 
ఈ నేపథ్యంలోనే సినిమాపై పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. నేరుగా ఓటీటీలోనే విడుదల చేసేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై క్వీన్ కంగనా ఫైర్ అయింది. ఆ వ్యాఖ్యలపై ఆమె స్పష్టతనిచ్చింది. సినిమా థియేటర్లలో విడుదలైన తరువాతే ఓటీటీలోకి వస్తుందని తేల్చి చెప్పారు. 
 
'తలైవి తమిళ వెర్షన్ హక్కులను అమెజాన్ ప్రైమ్, హిందీ హక్కులను నెట్ ఫ్లిక్స్‌లు సొంతం చేసుకున్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని బాలీవుడ్‌‌లోని కొందరు వ్యక్తులు సినిమాను నేరుగా ఓటీటీలోనే విడుదల చేస్తారంటూ కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 
 
వీరితో పాటు ప్రతి ఒక్కరికీ చెప్పేదేంటంటే, సినిమాను థియేటర్లలో రిలీజ్ చేశాకే ఓటీటీలోకి తీసుకొస్తాం. నిజమేంటో తెలుసుకోకుండా తప్పుడు కథనాలు ప్రచురించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం' అని ఆమె హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Dalit Man : అక్రమ సంబంధం.. దళిత వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగించారు..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు- ఏకగ్రీవంగా ఐదుగురి ఎన్నిక

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments