Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనా రనౌత్‌కు చుక్కెదురు-నిజంగా విదేశాలకు వెళ్ళాల్సి వుంటే..?

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (17:37 IST)
ముంబై హైకోర్టులో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌కు చుక్కెదురైంది. పాస్ పోర్ట్ రెన్యువల్ విషయంలో పోలీసుల నుండి ఎదురైనా ఇబ్బందులను తొలగించమంటూ ముంబై హైకోర్టును కంగనా రనౌత్ ఆశ్రయించింది.

పి.బి. వర్లే, ఎస్.పి. తావ్డేతో కూడిన బెంచ్ ఈ కేసును ఈ నెల 25కు వాయిదా వేసింది. అంతేకాదు. ఈ కేసులో పాస్ పోర్ట్ అధికారులను పార్టీగా పెట్టకపోవడాన్ని తప్పుపట్టింది. 
 
ఈ నెలలో తాను బుడాపెస్ట్‌లో జరుగబోతున్న ‘థక్కడ్’ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉందని, కానీ తనపై నమోదైన కేసుల కారణంగా పాస్ పోర్ట్ ను అధికారులు రెన్యూల్ చేయలేమని చెప్పారని కంగనా పిటీషన్‌లో పేర్కొంది. 
 
అయితే.. నిజంగా విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం ఉండి ఉంటే.. పూర్తి వివరాలతో కంగనా పిటీషన్ వేసి ఉండాల్సిందని, ఇప్పుడు ఇచ్చిన సమాచారం అస్పష్టంగా ఉందని కోర్టు విమర్శించింది. కేసు విచారణను ఈ నెల 25కు వాయిదా వేస్తూ, అప్పుడు పూర్తి వివరాలు ఇవ్వమని కోరింది.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments