Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇండియన్-2' సెట్స్‌లో క్రేన్ ప్రమాదంపై స్పందించిన కమల్ హాసన్

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (11:16 IST)
ఎస్.శంకర్ దర్శకత్వంలో 'భారతీయుడు' చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కుతోంది. విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా చిత్రీకరణ కోసం చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో భారీ సెట్ వేశారు. అయితే, ఈ సెట్‌లో 150 అడుగుల ఎత్తునున్న క్రేన్‌ ఒక్కసారిగా తెగిపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సహాయకులు మృతి చెందగా, మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో డైరెక్టర్‌ శంకర్‌ సహాయకులు ఉన్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. 
 
అయితే, ఈ ప్రమాదంపై హీరో కమల్ హాసన్ స్పందించారు. సెట్స్‌లో జరిగిన ప్రమాదం తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. ప్రమాదంలో ముగ్గురు ప్రతిభావంతులను కోల్పోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన బాధ కంటే వారి కుటుంబీకుల బాధ ఎన్నో రెట్లు ఎక్కువని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు కమల్‌ తెలిపారు. వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన తెలియజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments