Webdunia - Bharat's app for daily news and videos

Install App

"విక్రమ్" దండయాత్ర - రూ.300 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (11:27 IST)
విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం "విక్రమ్". లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానరులో సహ నిర్మాత ఆర్. మహేంద్రన్‌తో కలిసి నిర్మించారు. ఈ నెల 3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై, మెగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. 
 
కమల్ హాసన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దీంతో గత నాలుగేళ్ళుగా ఆయన ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. అంటే నాలుగేళ్ల తర్వాత విక్రమ్ రిలీజ్ అయింది. ఎంతగానో ఎదురు చూస్తున్న కమల్‌కు ఈ చిత్రం మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఈ చిత్రం తొలి రోజు నుంచే భారీ వసూళ్లను రాబడుతోంది. ఫలితంగా బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తూ రూ.300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. అదీ కూడా కేవలం 11 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. 
 
తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగులో హీరో నితిన్ రిలీజ్ చేశారు. రూ.7.48 కోట్ల థియేట్రికల్ వ్యాపారం జరుగగా, ఈ చిత్రం 11 రోజులు పూర్తయ్యే సరికి రూ.14.40 కోట్ల షేర్‌ను సాధించి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్‌లు కీలక పాత్రలను పోషించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments