Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామాక్షి మూవీస్ అధినేత డి. శివప్రసాద్ రెడ్డి కన్నుమూత

Webdunia
శనివారం, 27 అక్టోబరు 2018 (14:39 IST)
ప్రముఖ సినీ నిర్మాత, కామాక్షి మూవీస్ అధినేత డి. శివప్రసాద్ రెడ్డి (62) శనివారం కన్నుమూశారు. హృదయ సంబంధిత సమస్యతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. హృదయ సంబంధిత సమస్యతో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నారని.. అయినా చికిత్స ఫలించక శివప్రసాద్ రెడ్డి కన్నుమూసినట్లు వైద్యులు చెప్పారు. 
 
కాగా 1985లో కామాక్షి మూవీస్ బ్యానర్‌ను స్థాపించిన శివప్రసాద్ రెడ్డి అక్కినేని నాగార్జునకు పలు హిట్ సినిమాలు ఇచ్చారు. కార్తీక పౌర్ణమి, శ్రావణ సంధ్య, విక్కీ దాదా, ముఠామేస్త్రీ, అల్లరి అల్లుడు, ఆటోడ్రైవర్, సీతారామరాజు, ఎదురులేని మనిషి, నేనున్నాను, బాస్, కింగ్, రగడ, దడ, గ్రీకువీరుడు సినిమాలు నిర్మించారు. 
 
ఇకపోతే.. శివప్రసాద్ రెడ్డికి ఇద్దరు కుమారులు. ఆయన మృతితో తెలుగు సినీపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. శివప్రసాద్ రెడ్డి మృతి టాలీవుడ్‌కి తీరని లోటు అని సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి మహిళలంతా వేశ్యలా? మూడు రోజుల్లో వివరణ ఇవ్వండి - ఎన్.సి.డబ్ల్యూ సమన్లు

సజ్జల.. ఒక మూర్ఖుడిలా మాట్లాడారు... జగన్ సొంత చెల్లికే మర్యాద లేదు : వైఎస్ షర్మిల

సజ్జలా... నువ్వు జగన్‌కు గుమస్తావి.. బంట్రోతువి... : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

పెరుగుతున్న అప్పులు, చేతి రుణాలతో స్నేహితుల ఒత్తిడి.. వ్యక్తి ఆత్మహత్య

ప్రియుడితో పారిపోవచ్చుగా.. నా అన్న ప్రాణాలు ఎందుకుతీశావ్... శ్రష్టి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments