Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామాక్షి మూవీస్ అధినేత డి. శివప్రసాద్ రెడ్డి కన్నుమూత

Webdunia
శనివారం, 27 అక్టోబరు 2018 (14:39 IST)
ప్రముఖ సినీ నిర్మాత, కామాక్షి మూవీస్ అధినేత డి. శివప్రసాద్ రెడ్డి (62) శనివారం కన్నుమూశారు. హృదయ సంబంధిత సమస్యతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. హృదయ సంబంధిత సమస్యతో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నారని.. అయినా చికిత్స ఫలించక శివప్రసాద్ రెడ్డి కన్నుమూసినట్లు వైద్యులు చెప్పారు. 
 
కాగా 1985లో కామాక్షి మూవీస్ బ్యానర్‌ను స్థాపించిన శివప్రసాద్ రెడ్డి అక్కినేని నాగార్జునకు పలు హిట్ సినిమాలు ఇచ్చారు. కార్తీక పౌర్ణమి, శ్రావణ సంధ్య, విక్కీ దాదా, ముఠామేస్త్రీ, అల్లరి అల్లుడు, ఆటోడ్రైవర్, సీతారామరాజు, ఎదురులేని మనిషి, నేనున్నాను, బాస్, కింగ్, రగడ, దడ, గ్రీకువీరుడు సినిమాలు నిర్మించారు. 
 
ఇకపోతే.. శివప్రసాద్ రెడ్డికి ఇద్దరు కుమారులు. ఆయన మృతితో తెలుగు సినీపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. శివప్రసాద్ రెడ్డి మృతి టాలీవుడ్‌కి తీరని లోటు అని సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments