నందమూరి కళ్యాణ్రామ్ కథానాయకుడిగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నందమూరి కళ్యాణ్రామ్ నిర్మిస్తున్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ఇజం'. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను సెప్టెంబర్ 5వ తేదీన పూరి జగన్నాథ్ విడుదల చేశారు.
ఈ టీజర్కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. టీజర్ విడుదలైన 48 గంటలలోపే ఈ టీజర్ 1 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంలోని కళ్యాణ్రామ్ లుక్కి మంచి అప్రిషియేషన్ వస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న 'ఇజం' చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.