Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళాతపస్విని మెప్పించిన 'సర్వం తాళమయం'

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (14:34 IST)
శంకరాభరణం, సాగర సంగమం, స్వాతి కిరణం వంటి అద్భుత సంగీత భరిత చిత్రాలను అందించిన కళాతపస్వి కె. విశ్వనాథ్, రాజీవ్ మీనన్ ఇటీవల రూపొందించిన చిత్రం ‘సర్వం తాళ మయం’పై  ప్రశంసలు కురిపించారు. ఈ చిత్ర ప్రత్యేక ప్రదర్శనను చూసిన ఆయన ‘చాలా కాలం తర్వాత ఒక గొప్ప సంగీత భరిత చిత్రాన్ని చూసాను. రాజీవ్ మీనన్ ఈ చిత్రాన్ని చాలా బాగా తీసారు. ఆద్యంతం హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని రూపొందించి, ఒక మంచి సందేశాన్ని కూడా అందించిన రాజీవ్ మీనన్‌కి నా ఆశీర్వాదాలు’ అని అభినందిస్తూ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.
 
ఈ చిత్రాన్ని చూసిన ప్రముఖులలో ప్రముఖ దర్శకులు చంద్రశేఖర్ యేలేటి, మహానటి దర్శకులు నాగ అశ్విన్, యాత్ర దర్శకులు మహి వీ రాఘవ్ మొదలైనవారు రాజీవ్ మీనన్‌కు శుభాకాంక్షలు తెలియజేసారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ సినిమా మార్చి 8న తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ విడుదలవుతోంది. జీవీ ప్రకాష్, అపర్ణ బాలమురళి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నడుముడి వేణు, వినీత్, దివ్య దర్శిని ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments