Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిల్లూ హీరోయిన్ అనుపమను ఘోరంగా అవమానించిన జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్

ఐవీఆర్
మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (10:41 IST)
టిల్లూ స్క్వేర్ సక్సెస్ మీట్ నిన్న రాత్రి హైదరాబాదులో జరిగింది. ఈ చిత్రం సక్సెస్ మీట్‌కి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఇంకా చిత్ర బృందాన్ని అభినందించేందుకు వచ్చినవారిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యువహీరో విశ్వక్ సేన్ తదితరులు కూడా వచ్చారు. చిత్రంలో నటించిన హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ తనకు దక్కిన సక్సెస్ గురించి చెప్పేందుకు స్టేజిపైకి ఎక్కి మాట్లాడాలనుకున్నది.
 
ఐతే మైకు అందుకుని మాట్లాడుతూ వుండగా... జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెను మాట్లాడొద్దు మాట్లాడొద్దు అంటూ గట్టిగా గావుకేకలు పెట్టారు. ఎన్టీఆర్ స్టేజిపైకి వచ్చి మాట్లాడాలంటూ గోల చేస్తుండటంతో అనుపమ స్టేజి దిగి వెళ్లిపోబోయింది. ఇంతలో యాంకర్ సుమ... రెండు ముక్కలైనా మాట్లాడాలని అభ్యర్థించడంతో మరోసారి పరమేశ్వరన్ మాట్లాడేందుకు ప్రయత్నించబోగా మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అరిచారు.
 
ఇక చేసేది లేక టిల్లు హీరోయిన్ ఖిన్నురాలై స్టేజి దిగి వెళ్లిపోయిందట. నేరుగా వెళ్లి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆశీర్వాదాలు తీసుకుని నోరు మెదపకుండా తన సీట్లో కూర్చుండిపోయిందట ఈ లేడికళ్ల సుందరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతర లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments