Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరువునష్టం దావా కేసులో జీవిత రాజశేఖర్ దంపతులకు జైలుశిక్ష

Webdunia
బుధవారం, 19 జులై 2023 (08:57 IST)
ఓ పరువునష్టం దావా కేసులో సినీ నటుడు డాక్టర్ రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత రాజశేఖర్‌లకు హైదరాబాద్ నగరంలోని నాంపల్లి కోర్టు ఒక యేడాది జైలుశిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. అలాగే, రూ.5 వేల అపరాధం కూడా విధించింది. తాజాగా వెల్లడైన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, 
 
మెగాస్టార్ చిరంజీవి సొంతంగా హైదరాబాద్ నగరంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని గత 2011లో జీవిత, రాజశేఖర్లు ఆరోపించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆ దంపతులపై పరువు నష్టం దావా వేశారు. చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాలపైనా, ట్రస్టుపైనా అసత్య ఆరోపణలు చేశారంటూ పరువు నష్టం దావా వేశారు. వారు చేసిన ఆరోపణలకు సంబంధించిన మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా కోర్టుకు సమర్పించారు. 
 
దీనిపై సుధీర్ఘకాలంగా విచారణ జరిగిన తర్వాత మంగళవారం కోర్టు తీర్పును వెలువరించింది. ఇద్దరికీ యేడాది పాటు జైలుశిక్షతో పాటు రూ.5 వేల అపరాధం విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే, అపుడే జరిమానా చెల్లించడంతో పైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ బెయిల్ మంజూరు చేసింది. దీంతో వారిద్దరికి తాత్కాలికంగా ఊరట కలిగించింది. ఈ దంపతులకు కోర్టు జైలు శిక్ష విధించడం ఇపుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Dalit Man : అక్రమ సంబంధం.. దళిత వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగించారు..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు- ఏకగ్రీవంగా ఐదుగురి ఎన్నిక

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments