Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరువునష్టం దావా కేసులో జీవిత రాజశేఖర్ దంపతులకు జైలుశిక్ష

Webdunia
బుధవారం, 19 జులై 2023 (08:57 IST)
ఓ పరువునష్టం దావా కేసులో సినీ నటుడు డాక్టర్ రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత రాజశేఖర్‌లకు హైదరాబాద్ నగరంలోని నాంపల్లి కోర్టు ఒక యేడాది జైలుశిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. అలాగే, రూ.5 వేల అపరాధం కూడా విధించింది. తాజాగా వెల్లడైన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, 
 
మెగాస్టార్ చిరంజీవి సొంతంగా హైదరాబాద్ నగరంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని గత 2011లో జీవిత, రాజశేఖర్లు ఆరోపించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆ దంపతులపై పరువు నష్టం దావా వేశారు. చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాలపైనా, ట్రస్టుపైనా అసత్య ఆరోపణలు చేశారంటూ పరువు నష్టం దావా వేశారు. వారు చేసిన ఆరోపణలకు సంబంధించిన మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా కోర్టుకు సమర్పించారు. 
 
దీనిపై సుధీర్ఘకాలంగా విచారణ జరిగిన తర్వాత మంగళవారం కోర్టు తీర్పును వెలువరించింది. ఇద్దరికీ యేడాది పాటు జైలుశిక్షతో పాటు రూ.5 వేల అపరాధం విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే, అపుడే జరిమానా చెల్లించడంతో పైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ బెయిల్ మంజూరు చేసింది. దీంతో వారిద్దరికి తాత్కాలికంగా ఊరట కలిగించింది. ఈ దంపతులకు కోర్టు జైలు శిక్ష విధించడం ఇపుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

leopard: తల్లిదండ్రులతో నిద్రస్తున్న మూడేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన చిరుత.. ఆ తర్వాత ఏమైందంటే?

Chandra Babu: నారావారిపల్లెకు స్కోచ్ అవార్డు లభించింది: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

వివాహేతర సంబంధం.. 35 ఏళ్ల వ్యక్తిని భార్య, ప్రియుడు, సహచరుడు గొంతుకోసి చంపేశారు..

ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.6 లక్షల జరిమానా విధించిన కోర్టు

Nellore: భారీ వర్ష హెచ్చరికలు.. నెల్లూరు ప్రజలకు అలెర్ట్ - చేపల వేటకు వెళ్ళొద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments