Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గులాబీ' కోసం ఇల్లు అమ్మేద్దామనుకున్నాను: జేడీ

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (12:35 IST)
'గులాబీ'... కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా హీరో జేడీ చక్రవర్తి కెరీర్‌ని ఏ విధంగా మలుపు తిప్పిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా ఈటీవీ కార్యక్రమం 'ఆలీతో సరదాగా'లో పాల్గొన్న జేడీ చక్రవర్తి మాట్లాడుతూ ఈ సినిమాను గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. 
 
ఈ మేరకు జేడీ మాట్లాడుతూ... 'గులాబీ' కథను కృష్ణవంశీ గారు చెప్పినప్పుడు నాకు విపరీతంగా నచ్చేసింది. ఈ కథను తీసుకుని నిర్మాత దువ్వాసి మోహన్ దగ్గరికి వెళితే, కథంతా వినేసి 'హీరో రాజశేఖర్‌తో చేస్తే ఎలా ఉంటుంది?' అన్నాడు. అప్పటికి దువ్వాసి మోహన్ ఇంకా యాక్టర్ కాలేదు. దాని తర్వాత ఆ కథని తీసుకుని చాలా మంది నిర్మాతల దగ్గరికి వెళ్లాను. 
 
కానీ నాతో సినిమా చేయడానికి వాళ్లెవరూ ముందుకురాలేదు. దాంతో ఇక ఇల్లు అమ్మేద్దామని నిర్ణయించుకుని, ప్రయత్నాలు మొదలెట్టాను. ఈ విషయం వర్మగారికి తెలిసి నాకు చీవాట్లు పెట్టారు. ఇల్లు అమ్మొద్దనీ .. అమితాబ్‌తో కలిసి తానే ఈ సినిమాను నిర్మిస్తానంటూ ముందుకొచ్చారు" అని చెప్పుకొచ్చారు.
 
మరి అంత కమిట్‌మెంట్ ఉండబట్టే సినిమా అంత బాగా వచ్చిందేమో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PUBG : పబ్‌జీతో పరిచయమైన వ్యక్తితో వివాహిత జంప్.. వెయ్యి కిలోమీటర్ల జర్నీ

West Bengal Horror: లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Raj Tarun, Lavanya: లావణ్యకు బిగ్ షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ఏంటది?

Bengaluru : ఫ్రెండ్స్‌తో గొడవ.. రీల్స్ చేద్దామని 13 అంతస్థుకు వెళ్లింది.. జారిపడి యువతి మృతి

గ్యాంగ్‌స్టర్ జగ్గు భగవాన్‌పురియా తల్లి హర్జిత్ కౌర్‌ హత్య.. కాల్చి చంపేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments