Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిరత్నం దర్శకత్వంలో జయసుధ - నాని!

స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం వచ్చే యేడాది సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇందులో అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలుగా ఈ చిత్రం

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2017 (13:50 IST)
స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం వచ్చే యేడాది సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇందులో అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలుగా ఈ చిత్రం రూపొందనుంది. అలాగే, హీరోయిన్లుగా జ్యోతిక, ఐశ్వర్య రాజేష్‌లు ఉన్నారు. 
 
నిజానికి మణిరత్నం - అరవింద్ స్వామి కాంబినేషన్‌లో అనేక చిత్రాలు వచ్చాయి. ప్రధానంగా 'రోజా', 'దళపతి', 'బొంబాయి', 'కాదల్' వంటి హిట్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ తాజా మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. 
 
అయితే, ఈ మల్టీస్టారర్ చిత్రంలో సహజ నటి జయసుధతో పాటు నేచురల్ స్టార్ నాని కూడా కీలక పాత్రలను పోషించనున్నారేనే వార్తలు హల్ చేస్తున్నాయి. అయితే ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి క్లారిటీ రావలసి ఉంది.
 
కాగా, ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. అలాగే, సంతోష్ శివన్ కెమెరామెన్‌గా పని చేయనున్నారు. అయితే, తమిళ హీరోలు విజయ్ సేతుపతి, శింబు, ఫాహద్ ఫాజిలకు మణిరత్నం దర్శకత్వంలో నటించనుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments