Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిరత్నం దర్శకత్వంలో జయసుధ - నాని!

స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం వచ్చే యేడాది సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇందులో అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలుగా ఈ చిత్రం

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2017 (13:50 IST)
స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం వచ్చే యేడాది సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇందులో అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలుగా ఈ చిత్రం రూపొందనుంది. అలాగే, హీరోయిన్లుగా జ్యోతిక, ఐశ్వర్య రాజేష్‌లు ఉన్నారు. 
 
నిజానికి మణిరత్నం - అరవింద్ స్వామి కాంబినేషన్‌లో అనేక చిత్రాలు వచ్చాయి. ప్రధానంగా 'రోజా', 'దళపతి', 'బొంబాయి', 'కాదల్' వంటి హిట్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ తాజా మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. 
 
అయితే, ఈ మల్టీస్టారర్ చిత్రంలో సహజ నటి జయసుధతో పాటు నేచురల్ స్టార్ నాని కూడా కీలక పాత్రలను పోషించనున్నారేనే వార్తలు హల్ చేస్తున్నాయి. అయితే ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి క్లారిటీ రావలసి ఉంది.
 
కాగా, ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. అలాగే, సంతోష్ శివన్ కెమెరామెన్‌గా పని చేయనున్నారు. అయితే, తమిళ హీరోలు విజయ్ సేతుపతి, శింబు, ఫాహద్ ఫాజిలకు మణిరత్నం దర్శకత్వంలో నటించనుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాలేగావ్ స్కూటర్ బాంబు పేలుళ్ళ కేసు : నిందితులంతా నిర్దోషులే...

పక్కింటికి ఆడుకోవడానికి వెళ్తే.. అన్నయ్యతో పాటు బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం

13 ఏళ్ల బాలికను 40 ఏళ్ల వ్యక్తికిచ్చి వివాహం, అత్తారింటికి వెళ్లనన్న బాలిక

మరో యువకుడితో సహజీవనం చేస్తూ ప్రియుడు పట్టించుకోలేదనీ...

తల్లిబాట పథకం : గిరిజనులకు రగ్గులు పంపిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments