తిరుపతిలో సెటిల్ అవుతా, గోవిందా... గోవిందా నామస్మరణతో నిద్రలేస్తా: జాన్వీ కపూర్

ఠాగూర్
గురువారం, 23 జనవరి 2025 (14:38 IST)
భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి శ్రీవారి సన్నిధి తిరుమల తిరుపతిలో హాయిగా జీవించాలని హీరోయిన్ జాన్వీ కపూర్ తన మనసులోని మాటను వెల్లడించారు. దివంగత నటి శ్రీదేవి కుమార్తెగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ తన టాలెంట్‌తో అగ్రనటిగా ఎదిగింది. పాన్ ఇండియా మూవీలు చేస్తూ ఎంతో బిజీ లైఫ్‌ను గడుపుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషా చిత్రాల్లో నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో దేవరన నటించిన జాన్వీ.. ఇపుడు రామ్ చరణ్‌తో ఆర్సీ 16లో హీరోయిన్‌గా నటిస్తుంది. 
 
ఈ క్రమంలో బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ షోలో పాల్గొని పిచ్చాపాటిగా మాట్లాడారు. తిరుపతిలో పెళ్లి చేసుకోవాలనేది తన కోరిక అని చెప్పింది. భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి తిరుమలలో హాయిగా జీవించాలని ఉందని చెప్పారు. ప్రతి రోజూ అరటి ఆకులో అన్నం తింటూ గోవిందా గోవిందా అని స్మరించుకోవాలని ఉందని తెలిపారు. పనిలోపనిగా దర్శకుడు మణిరత్నం సినిమాల్లోని సంగీతాన్ని వింటూ కూర్చోవాలని ఉందని తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments