అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్. ఈమె ఇప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. కాగా ఈమె నటించిన తాజా చిత్రం వచ్చే నెల 11వ తేదీన విడుదుల కాబోతోంది. తొలి సారి థ్రిల్లర్ చిత్రంలో నటించింది ఈ మల్లెతీగ.
రూహి అనే టైటిల్తో రూపొందుతున్న చిత్రంలో జాన్వీతో పాటు రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలో కనబడుతారు. ఈ ట్రైలర్ చూసినవారు రాత్రిపూట కూడా ఆ ట్రైలర్ సీన్ గుర్తొచ్చి గజగజ వణికిపోతున్నారట. మరి చిత్రం ఎలా వుంటుందన్నది చూడాలి.