Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగపతి బాబు సంచలన నిర్ణయం.. ఏంటది?

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2023 (15:48 IST)
మ్యాన్లీ హీరో జగపతి బాబు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి సినిమాలు చేస్తున్నాడు. ప్రతినాయకుడు, బలమైన పాత్రలు చేస్తూ మెప్పించాడు. బలమైన పాత్రలుంటే ఏ సినిమాలోనైనా నటించేందుకు సిద్ధమని అంటున్నారు. హీరోగా కంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగా టర్న్ తీసుకున్నా అతడికి క్రేజ్ పెరగడంతో పాటు డిమాండ్ కూడా పెరిగింది. 
 
నటుడిగా బిజీగా ఉన్న జగపతిబాబు ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఆయన నిర్ణయం షాకింగ్‌గా ఉంది. ఇకపై తన పేరుతో ఉన్న అభిమాన సంఘాలతో ఎలాంటి సంబంధం లేదని తేల్చేశాడు. ట్రస్టుకు కూడా దూరమవుతున్నారని అన్నాడు. 
 
ఈ మేరకు ట్విట్టర్ ద్వారా అభిమానులకు ఓ పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ.. "33 ఏళ్లుగా నా ఎదుగుదలకు నా కుటుంబంతో పాటు నా అభిమానులను శ్రేయోభిలాషులుగా భావించాను. అలాగే వారి కుటుంబ విషయాల్లో పాలుపంచుకుంటూ వారి కష్టాలను నా కష్టాలుగా భావించి నాతో పాటు ఉండే నా అభిమానులకు నేను నీడని. 
 
అభిమానులంటే అభిమానులని మనస్ఫూర్తిగా నమ్ముతాను. అయితే బాధాకరమైన విషయమేమిటంటే, కొంతమంది అభిమానులు ప్రేమించడం కంటే ఆశించడం ఎక్కువైపోయింది. నాకు ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. 
 
నా హృదయం అంగీకరించకపోయినా, ఇక నుంచి నాకు ఇష్టమైన సంఘాలతో, నమ్మకంతో ఎలాంటి సంబంధం లేదని బాధతో చెప్పాలి. నేను వారి నుండి రిటైర్ అవుతున్నాను. కానీ నన్ను ప్రేమించే అభిమానులతో ఎప్పుడూ ఉంటాను. జీవించు బ్రతకనివ్వు" అని జగపతిబాబు అన్నారు.
 
దీంతో అభిమానులు కూడా ఆయనకు మద్దతు పలుకుతున్నారు. ఇది మంచి నిర్ణయమని అంటున్నారు. నిన్ను నిజంగా ప్రేమించేవారికి, ఆపదలో ఉన్నవారికి అండగా నిలిస్తే చాలు. ఇప్పుడు జగపతి బాబు పోస్ట్ వైరల్ అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pen Cap in Lung: ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్.. 26 ఏళ్ల తర్వాత తొలగించిన వైద్యులు.. ఎక్కడ?

కర్ణాటకలో పరువు హత్య.. పూజారినే పెళ్లి చేసుకుంటానన్న కుమార్తెను చంపేసిన తండ్రి

Delivery Boy: డెలివరీ పర్సన్‌‌తో సహజీవనం చేసిన మైనర్ బాలిక.. తర్వాత ఏమైందంటే?

Raja Singh: నేను స్వతంత్ర ఎమ్మెల్యే... స్వేచ్ఛగా మాట్లాడగలను.. రాజా సింగ్

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు - అక్టోబర్ వరకు రిజర్వ్‌లో తీర్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments