Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున మేనకోడలితో పెళ్లా? పుకార్లపై క్లారిటీ ఇచ్చిన 'గూఢచారి' హీరో

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (14:28 IST)
గూఢచారితో హిట్ కొట్టి విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన హీరో అడవి శేష్ పెళ్లి గురించి ప్రస్తుతం ఒక వార్త హల్‌చల్ చేస్తోంది. గూఢచారిలో తనతో పాటు నటించిన సుప్రియను అడవి శేష్ పెళ్లి చేసుకోబోతున్నాడని సోషల్ మీడియాలో వార్త హల్‌చల్ చేస్తోంది. దీనికి కారణం లేకపోలేదు, చాలా కాలం నుండి అడవి శేష్ షాకింగ్ న్యూస్ చెబుతా అంటూ సోషల్ మీడియాలో ఆసక్తి కరమైన పోస్ట్‌లు పెడుతుండటంతో జనం తమకు తోచింది ఊహించుకుని వాటిని షేర్ చేసేసుకున్నారు.
 
అయితే తాజాగా అడవి శేష్ దీనిపైన క్లారిటీ ఇచ్చేసాడు. సోషల్ మీడియాలో తనకు సుప్రియకు వివాహం జరగబోతున్నట్లు వస్తున్న వార్తలు ఒట్టి పుకార్లే అని కొట్టిపారేసాడు. ఫేక్ న్యూస్... బాధ్యతా రాహిత్యం అంటూ ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తున్న వారిపై మండిపడ్డాడు. ప్రస్తుతం తన జీవితంలో ముఖ్యమైన విషయం ఏదైనా ఉంటే అది సినిమానే అన్నారు. రచయితగా కూడా తాను చాలా సంతృప్తిగా ఉన్నట్లు, ఇవి తప్ప తాను వేరే విషయాల జోలికి పోదలచుకోలేదని తేల్చి చెప్పాడు.
 
తమాషా ఏమిటంటే నిన్న నాగార్జున జగన్‌తో భేటీ అయిన సందర్భంలో సుప్రియ, శేష్‌ల పెళ్లికి శుభలేఖ ఇవ్వడానికే నాగార్జున జగన్ దగ్గరకు వెళ్లారని మరో పుకారు కూడా సోషల్ మీడియాలో వచ్చింది. మొత్తానికి అడవి శేష్ క్లారిటీతో ఇవన్నీ కేవలం పుకార్లే అని తేలిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!

Iran: ముగ్గురు సీనియర్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయేల్

హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు - 8 మంది మృత్యువాత

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments