Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్య కథను ముందుగా సుక్కు ఎవరికి చెప్పాడో తెలుసా?

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (16:47 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రం ఆర్య. ఈ చిత్రం ద్వారా క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమర్ దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు నిర్మించారు. వన్ సైడ్ లవ్ అంటూ ఆర్య ప్రేమకథా చిత్రాల్లో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. అటు అల్లు అర్జున్‌కి, ఇటు సుకుమార్‌కి ఇద్దరికీ... ఆర్య మంచి పేరు తీసుకువచ్చింది. 
 
అంతేకాకుండా.. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ వసూలు చేసింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
 
 అది ఏంటంటే... సుకుమార్ ఆర్య కథను రెడీ చేసిన తర్వాత దిల్ రాజుకి చెబితే.. ఈ సినిమాను తను నిర్మిస్తానని చెప్పారట. ఏ హీరోకి చెబుదామని ఆలోచించి.. సుకుమార్ ఫస్ట్ ప్రభాస్‌కి ఈ కథను చెప్పాడట. కథ విని ప్రభాస్ బాగుందని చెప్పాడట కానీ.. ఎందుకనే ఇంట్రస్ట్ చూపించలేదట. 
 
దీంతో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్పండి చేస్తానన్నాడట సుకుమార్. అయినా.. ప్రభాస్ స్పందించకపోవడంతో ఈ కథను రవితేజకు చెప్పాడట. రవితేజ కూడా ఈ కథపై అంతగా ఆసక్తి చూపించలేదట. ఆ తర్వాత నితిన్‌కి చెబితే.. అక్కడ కూడా సేమ్ రియాక్షన్.
 
 ఆ తర్వాత అల్లు అర్జున్‌కి చెబితే.. వెంటనే ఓకే చెప్పాడట. 4 కోట్లతో రూపొందిన ఈ సినిమా 25 కోట్లు కలెక్ట్ చేసింది. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. నిర్మాతకు ఆర్య ఎంతటి లాభాలను అందించిందో.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భూమ్మీద ఇంకా నూకలున్నాయ్ ... ఒకే ఒక మృత్యుంజయుడు... (Video)

ఎయిరిండియా విమానం ఎలా కూలిపోయిందో చూడండి (Video)

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments