Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంత సంపాదించి ఏం లాభం అందుకే ఆకుకూర‌లు పండిస్తున్నాః స‌మంత‌

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (16:57 IST)
Samantha terrace gardening
ఎంత సంపాదించినా ఏం లాభం. అవ‌స‌రానికి తిన‌డానికి క‌నీసం కాయ‌గూర‌లు, ఆకుకూర‌లు లేకుండా బ‌జారు వెంట ప‌డుతున్న ప్ర‌జ‌ల్ని చూసి చ‌లించిపోయానంటోంది స‌మంత అక్కినేని.

కోవిడ్‌-19 స‌మ‌యంలో లాక్‌డౌన్ పెట్టిన‌ప్పుడు దేశ‌మంతా సామాన్య‌ల పాట్లు చూస్తుంటే నేను చైత‌న్య చ‌లించిపోయాం. గతేడాది కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో లాక్‌డౌన్‌ ఉంటుందని తెలిసి అందరూ సరుకులు, కూరగాయల కోసం దుకాణాల ముందు బారులు తీరారు. ఆకుకూరలు కూడా సరిగ్గా దొరకని పరిస్థితి.

అలాంటి సమయంలో ‘ఇంత సంపాదించి ఏం లాభం. సరిగ్గా భోజనం కూడా తినలేనప్పుడు’ అని చై, నేను అనుకున్నాం. అలా, నేను టెర్రస్‌ గార్డెనింగ్‌ ప్రారంభించాను. ఆ తర్వాత నుంచి వెజిటేరియన్‌గా మారాను. షూటింగ్‌ లేకుండా ఇంటి దగ్గరే ఉంటే అన్ని విషయాలు నేనే చూసుకుంటాను.’’ అని సమంత తెలిపారు.
 
సమంత ప్రస్తుతం ‘ది ఫ్యామిలీ మేన్‌-2’తో ఓటీటీలో తన సత్తా చాటుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్ర‌మోష‌న్‌లో ఆమె ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు. అయితే ఈ సినిమా రిలీజ్‌కు బ్రేక్‌ ప‌డే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. త‌మిళుల ఆత్మ‌గౌర‌వం దెబ్బ‌తింటుంద‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఈ సినిమా ఆపివేయ‌మ‌ని కేంద్రాన్ని కోరింది. మ‌రి ఏమి జ‌రుగుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments