Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంత సంపాదించి ఏం లాభం అందుకే ఆకుకూర‌లు పండిస్తున్నాః స‌మంత‌

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (16:57 IST)
Samantha terrace gardening
ఎంత సంపాదించినా ఏం లాభం. అవ‌స‌రానికి తిన‌డానికి క‌నీసం కాయ‌గూర‌లు, ఆకుకూర‌లు లేకుండా బ‌జారు వెంట ప‌డుతున్న ప్ర‌జ‌ల్ని చూసి చ‌లించిపోయానంటోంది స‌మంత అక్కినేని.

కోవిడ్‌-19 స‌మ‌యంలో లాక్‌డౌన్ పెట్టిన‌ప్పుడు దేశ‌మంతా సామాన్య‌ల పాట్లు చూస్తుంటే నేను చైత‌న్య చ‌లించిపోయాం. గతేడాది కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో లాక్‌డౌన్‌ ఉంటుందని తెలిసి అందరూ సరుకులు, కూరగాయల కోసం దుకాణాల ముందు బారులు తీరారు. ఆకుకూరలు కూడా సరిగ్గా దొరకని పరిస్థితి.

అలాంటి సమయంలో ‘ఇంత సంపాదించి ఏం లాభం. సరిగ్గా భోజనం కూడా తినలేనప్పుడు’ అని చై, నేను అనుకున్నాం. అలా, నేను టెర్రస్‌ గార్డెనింగ్‌ ప్రారంభించాను. ఆ తర్వాత నుంచి వెజిటేరియన్‌గా మారాను. షూటింగ్‌ లేకుండా ఇంటి దగ్గరే ఉంటే అన్ని విషయాలు నేనే చూసుకుంటాను.’’ అని సమంత తెలిపారు.
 
సమంత ప్రస్తుతం ‘ది ఫ్యామిలీ మేన్‌-2’తో ఓటీటీలో తన సత్తా చాటుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్ర‌మోష‌న్‌లో ఆమె ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు. అయితే ఈ సినిమా రిలీజ్‌కు బ్రేక్‌ ప‌డే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. త‌మిళుల ఆత్మ‌గౌర‌వం దెబ్బ‌తింటుంద‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఈ సినిమా ఆపివేయ‌మ‌ని కేంద్రాన్ని కోరింది. మ‌రి ఏమి జ‌రుగుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిర్ ఇండియా ప్రమాదం- 87 మంది మృతుల డీఎన్ఏ మ్యాచ్ అయ్యాయి..

ఖతార్‍‌లో ఐదుగురు తెలుగు పాస్టర్లు అరెస్టు.. ఎందుకో తెలుసా?

ఇరాన్‌కు ఆయనే ప్రధాన శత్రువు - డోనాల్డ్ ట్రంప్ హత్యకు కుట్ర : నెతన్యాహు

Married Couple: ప్రేమించి పెళ్లి.. నెల తిరగక ముందే రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం.. ఫేస్‌‌‌‌‌బుక్ పరిచయం కొంపముంచింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments