బోల్డ్ సన్నివేశం ఉంటే.. క్లారిటీ ఇస్తేనే చేస్తాను : ఎరికా ఫెర్నాండెజ్

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (16:33 IST)
'కుచ్‌ రంగ్‌ ప్యార్‌ కే ఐసే భీ'తో బుల్లితెర మీద తన ప్రయాణం మొదలు పెట్టింది ఎరికా ఫెర్నాండేజ్‌. దీనికి కొనసాగింపుగా వచ్చిన రెండో సీజన్‌లోనూ ఎరికానే నటించింది. 2018లో ప్రారంభమైన కసౌటీ జిందగీ కే 2వ సీజన్‌లోనూ తన నటనతో మెప్పించింది. ఈమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ, బోల్డ్ సన్నివేశాలపై స్పందించింది. 
 
సినీ రంగంలోకి ప్రవేశించిన తర్వాత అన్ని రకాల పాత్రలు చేయాల్సిందే. ముఖ్యంగా వెండితెరపై అందాలు ఆరబోయాల్సిందే. అలాగే, బోల్డ్ సన్నివేశాల్లో నటించాల్సిన పరిస్థితి ఎదురైతే తప్పక నటించాల్సిందే. ఇది ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉన్న ట్రెండ్. నటన మీద ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగు పెట్టాక ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయాల్సిందేనని చెబుతోంది. 
 
గ్లామర్‌, డీగ్లామర్‌, ఛాలెంజింగ్‌.. ఇలా అన్నిరకాల పాత్రలను అంగీకరించి తీరాల్సిందే. ప్రేక్షకుల మనసు దోచుకోవాలంటే జనాలు మెచ్చే సినిమాలు చేయాల్సిందే! అయితే ఎలాంటి సన్నివేశంలోనైనా అలవోకగా నటించే హీరోయిన్లు బోల్డ్‌ సీన్లు వచ్చేసరికి మాత్రం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. 
 
ఈ పాత్రలపై ఆమె మాట్లాడుతూ, అభ్యంతరకర సన్నివేశాల్లో నటించాల్సి వచ్చినప్పుడు ఇబ్బందిగా ఫీల్‌ అవుతానని తెలిపింది. తనకు ఇప్పటివరకు అలాంటి పాత్రలు చాలా తక్కువగా వచ్చాయని, వాటిలో చాలామటుకు నో చెప్పానని తెలిపింది. కొన్ని బోల్డ్‌ సన్నివేశాలను కావాలని బలవంతంగా చొప్పిస్తారని, అలాంటప్పుడు ఆ సీన్లలో నటించేందుకు నిరభ్యంతరంగా తిరస్కరిస్తానని స్పష్టం చేసింది. 
 
ఒకవేళ అలాంటి సన్నివేశాల్లో నటించాల్సి వస్తే బోల్డ్‌ సన్నివేశం ఎందుకు అవసరమనేది ముందు నాకు క్లారిటీ ఇవ్వాలి. నిజంగానే అది తప్పనిసరి అనిపించినప్పుడు మాత్రమే అందులో నటించేందుకు నేను మానసికంగా సిద్ధమవుతాను. అంతేకానీ కథ డిమాండ్‌ చేయకపోయినా అలాంటి సన్నివేశాల్లో నటించాల్సిందే అంటే అందుకు అస్సలు ఒప్పుకోను అని తేల్చి చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments