Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రులు పోవడంతో ఒంటరితనం.. ఇపుడు నేనూ - నా బిడ్డ మాత్రమే ఉన్నాం : గౌతమి

Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (12:25 IST)
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసమయంలో హీరోయిన్‌గా రాణించిన అతికొద్ది మంది హీరోయిన్లలో గౌతమి ఒకరు. అయితే, ఈమె వ్యక్తిగత జీవితంలో సినిమా కష్టాలను చవిచూశారు. వైవాహిక జీవితం మొదలుకుని వ్యక్తిగత జీవితం వరకు అనేక కష్టాలు అనుభవించారు. ఇపుడు తన ఏకైక కుమార్తె కోసం ఆమె జీవిస్తున్నారు. 
 
తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన తల్లిదండ్రులు పోవడంతో ఒంటరితనాన్ని అనుభవించినట్టు చెప్పారు. ముఖ్యంగా, వైవాహిక జీవితంలో అనేక ఒడి దుడుకులు ఎదుర్కొన్నానని తెలిపారు. పైగా, అది ఒక పరీక్షా కాలంగా ఆమె అభివర్ణించారు. 
 
"మా తల్లిదండ్రులు ఎంతో గారాబంగా పెంచారు. అగ్గిపుల్ల కూడా గీయడం నాకు చేతకాదు. అలా పెంచారు. నా 16వ యేటనే హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. నాకు పాప పుట్టిన తర్వాత నేను సింగిల్ పేరెంట్‌గా ఉన్నాను. చేతుల్లో పసిబిడ్డను పట్టుకుని మా తల్లిదండ్రుల వద్దకు వచ్చేశాను. ఆ తర్వా అమ్మ చనిపోయారు. అప్పటి నుంచి మా నాన్న నా గురించే ఆలోచించేవారు. ఒక యేడాది తర్వాత ఆయన కూడా పోయారు. 
 
ప్రస్తుతం నేను, నా బిడ్డ మాత్రమే మిగిలిపోయాం. ఇంటిపట్టునే ఉండిపోవడంతో మనుషులను సరిగ్గా అంచనా వేయలేకపోయాను. ఎవరు ఎలాంటివారు అనేది తెలుసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది" అని గౌతమి చెప్పుకొచ్చారు. కాగా, ఈమె హీరో కమల్ హాసన్‌తో కొంతకాలం సహజీవనం చేసి ఆ తర్వాత వేరుపడిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments