Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోహన్‌బాబు ఇంట్లో రూ.10లక్షలు చోరీ.. వ్యక్తి అరెస్ట్.. తిరుపతిలో పట్టుకున్నారు..

సెల్వి
బుధవారం, 25 సెప్టెంబరు 2024 (19:57 IST)
సినీనటుడు మోహన్‌బాబు ఇంట్లో ఉద్యోగం చేస్తూ రూ.10 లక్షల చోరీకి పాల్పడిన వ్యక్తిని పహాడీషరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మోహన్ బాబు ఇంట్లో పనిచేసే గణేష్ నాయక్ రెండు రోజుల క్రితం జల్పల్లి గ్రామంలోని ఇంట్లోని సర్వెంట్ క్వార్టర్స్‌లో ఉంచిన డబ్బును అపహరించాడు.

ఆ మొత్తాన్ని తీసుకుని గణేష్ రెండు రోజుల క్రితం తిరుపతికి పారిపోయాడు. ఫిర్యాదు మేరకు పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసి ఆ వ్యక్తిని తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
 
కాగా 2019లో కూడా మొహన్ బాబు ఇంట్లో చోరీ జరిగిందని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంట్లో పనిచేసే పనిమనిషే డబ్బు నగలు చోరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడు కూడా.. ఇంట్లో పనిచేసే వాళ్లే దొంగతనం చేశారని ఫిర్యాదు చేయడం కొసమెరుపు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇదే మన చివరి కలయిక, మనమిక కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

హనీమూన్ హత్య కేసు : భర్త మృతదేహం వద్ద భార్య ప్రియుడు..

యూఎస్ ఎయిర్ పోర్టులో భారతీయ విద్యార్థిని చేతికి సంకెళ్లు వేసి అలా కట్టిపడేశారు

బీహార్‌లో నకిలీ పోలీస్ స్టేషన్ - యేడాదిగా బలవంతపు వసూళ్లు!

మహిళలంతా కలిసి ఓ వృద్ధుడిని చంపేసి ఆనవాళ్లు లేకుండా చేశారు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments