Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకేం సంబంధం లేదు, పబ్ నిర్వహించినందు వల్లే..? నవదీప్

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2023 (19:42 IST)
హైదరాబాద్ మాదాపూర్‌లోని ఒక అపార్టుమెంట్‌లో నార్కోటిక్ అధికారులు, పోలీసులు కలిసి సుమారు పది లక్షల రూపాయల విలువుగల డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నలుగురు నైజీరియన్స్, ఒక సినిమా దర్శకుడు, నలుగురు ఇతర వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో రాంచందర్ అనే వ్యక్తి డ్రగ్ సప్లయర్ అని, అతనితో నవదీప్‌కి సంబంధాలు ఉన్నాయని పోలీసుల ఆరోపణ. అందుకనే నవదీప్ ని ఈరోజు సుమారు ఆరు గంటలపాటు నార్కోటిక్ పోలీసులు విచారించారు అని తెలిసింది. 
 
అయితే బయటకి వచ్చిన తరువాత నవదీప్ తనకేమీ డ్రగ్స్‌తో సంబంధం లేదని, తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని చెప్పాడు. డ్రగ్స్ కేసులో నార్కోటిక్ విభాగం పోలీసుల ఎదుట హాజరైన నటుడు నవదీప్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏడేళ్ల క్రితం కాల్ లిస్టు ఆధారంగా విచారణ చేస్తున్నారని తెలిపారు. గతంలో పబ్ నిర్వహించినందువల్లే నన్ను విచారించారు. గతంలో సిట్, ఈడీ కూడా విచారించింది. ప్రస్తుతం నార్కో పోలీసులు విచారిస్తున్నారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాను. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పారనే విషయాన్ని తెలియజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయలసీమకు వస్తోన్న టెస్లా.. చంద్రబాబు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా?

తెలంగాణ పీసీసీ రేసులో చాలామంది వున్నారే.. ఎవరికి పట్టం?

అంగన్‌వాడీ టీచర్‌ నుంచి శాసన సభ్యురాలిగా ఎదిగిన శిరీష.. స్టోరీ ఏంటి?

పిఠాపురంలో 3.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన పవన్

ఢిల్లీ - వారణాసి వందే భారత్‌ రైలులో నీటి లీకేజీ... Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments