Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాడు అడగాలేగానీ.. నా ప్రాణమైనా ఇచ్చేస్తా... తమ్ముడుపై అన్నయ్య ప్రేమ

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (11:45 IST)
మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌లో ఆచార్య అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ కరోనా కారణంగా వాయిదాపడింది. అలాగే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది  బాలీవుడ్ చిత్రం పింక్‌కు రీమేక్. ఇది కూడా కరోనా కారణంగా వాయిదాపడింది. పైగా, దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోవుంది. దీంతి సినీ సెలెబ్రిటీలంతా తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. 
 
ఇదిలావుంటే, ఫిల్మ్ నగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆచార్య చిత్రం తర్వాత చిరంజీవి మలయాళ చిత్రం లూసీఫర్ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రం హక్కులను ఆయన తనయుడు, హీరో కొనుగోలు చేశారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రంలో మోహన్ లాల్, పృథ్విరాజ్ నటించారు. తెలుగులో చిరంజీవి - రాంచరణ్ కలిసినటిస్తారన్న ప్రచారం సాగుతోంది. 
 
అయితే, తాజా సమాచారం మేరకు.. చిరంజీవి ఈ కథను తన సోదరుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట. అదీ కూడా పవన్ అడిగితే ఈ చిత్ర రైట్స్ ఇచ్చేందుకు సిద్ధమని చిరంజీవి తాజాగా వ్యాఖ్యానించినట్టు సమాచారం. అదే జరిగితే పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్‌లు కలిసి ఈ చిత్రంలో నటించే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
అయితే, ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే పవన్ ఇప్పటికే మూడు సినిమాలకు కమిట్ అయ్యివున్నారు. ఇందులో మొదటది వకీల్ సాబ్ చిత్రంకాగా, ఆ తర్వాత క్రిష్ జాగర్లమూడి, ఆ తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో నటించేందుకు సమ్మతించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: తమిళనాడులో జనసేన ఏర్పాటు.. స్టాలిన్‌ను కొనియాడిన పవన్ కల్యాణ్

రాళ్లతో కొడతానంటే ప్రశ్నపత్రం చూపించాను... వాళ్లు ఫోటో తీసుకున్నారు : విద్యార్థిని

మాజీ స్పీకర్ తమ్మినేని డిగ్రీ సర్టిఫికేట్.. నకిలీదా.. విచారణ జరపండి..!!

ఏపీలో 4 రోజుల పాటు వడగళ్ల వర్షం ... ఈదురు గాలులు వీచే అవకాశం... ఐఎండీ

Lawyer: హైదరాబాదులో దారుణం: అడ్వకేట్‌ను కత్తితో దాడి చేసి హత్య- డాడీని అలా చేశారు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments