Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ సమంతకు అరుదైన గౌరవం (video)

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (12:49 IST)
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యతో వైవాహిక బంధాన్ని తెంచుకున్న తర్వాత హీరోయిన్ సమంత దశ తిరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తన సినీ కెరీర్‌పై దృష్టిసారించిన  సమంత... వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతున్నారు. ఈ క్రమంలో తన పారితోషికాన్ని కూడా పెంచేశారు. 
 
ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా సామ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. స్నేహితులతో కలిసి విదేశాలకు చక్కర్లు కొడుతూ అందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది సమంత. తాజాగా సామ్ అరుదైన గౌరవం సొంతం చేసుకుంది.
 
ఈ నెల గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమానికి స్పీకర్‏గా వ్యవహరించే అవకాశాన్ని సమంత దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడేందుకు ఐఎఫ్ఎఫ్ఐ నిర్వాహకులు సమంతను ఎంపిక చేశారు. దీంతో ఈ వేడుకలో స్పీకర్‏గా ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది భారత నటిగా సమంత గుర్తింపు పొందింది. 
 
ఇక సమంతతోపాటు.. బాలీవుడ్ నటుడు మనోజ్ భాజ్ పాయ్, డైరెక్టర్ అరుణా రాజే, నటుడు జాన్ ఎడతత్తిల్, డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రిలకు కూడా ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమం నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనుంది.

 

సంబంధిత వార్తలు

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

గుర్తుపట్టలేని విధంగా ఇరాన్ అధ్యక్షుడి మృతదేహం? అక్కడ తోడేళ్లు వున్నాయట

వారంలో ఎక్కువ రోజులు కెఫీన్ తాగుతున్న యువత..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. కవితకు బెయిల్ పొడిగింపు

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

తర్వాతి కథనం
Show comments