Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్‌కు జోడీగా నివేదా పేతురాజ్..?

Webdunia
సోమవారం, 8 జులై 2019 (11:56 IST)
హిట్‌ల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అక్కినేని వారసుడు ఇటీవల ‘మిస్టర్‌ మజ్ను’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు  త్వరలో బొమ్మరిల్లు భాస్కర్‌ తెరకెక్కించబోయే సినిమాలో నటించనున్నట్లు సినీవర్గాల సమాచారం.


ఈ సినిమా షూటింగ్ జూలై మూడో వారంలో ప్రారంభం కానుండగా, ఇందులో హీరోయిన్‌గా కోలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్‌ను నటింపజేయాలని చిత్రబృందం భావిస్తోందట.
 
ఇప్పటికే నివేదా పేతురాజ్ తెలుగులో ‘మెంటల్‌ మదిలో’, ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’ సినిమాలలో నటించి, మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది నివేదా. 
 
ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే అఖిల్‌, నివేదా సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు అల్లు అరవింద్‌, బన్నీ వాసు సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments