Webdunia - Bharat's app for daily news and videos

Install App

కైరా అద్వానీతో ప్రభాస్ రొమాన్స్.. కెమిస్ట్రీ పండితే ఇంకేముంది? (video)

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (09:58 IST)
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సాహో సినిమాలో నటించాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో గుర్తింపు సంపాదించిపెట్టలేకపోయింది. సాహో తర్వాత ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ డియర్ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. ఇక మహానటి వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలోను ప్రభాస్ ఓ సినిమా చేయనుండగా, ఈ చిత్రంలో కథానాయిక ఎవరనే దానిపై కొద్దిరోజులుగా చర్చ సాగుతోంది. 
 
నాగ్ అశ్విన్‌- ప్రభాస్ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతుండగా, ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. కీలక పాత్రల కోసం పలువురు బాలీవుడ్ స్టార్స్‌ని ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక హీరోయిన్ కోసం బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఈ సినిమాలో నటించడం దాదాపు ఖరారైందని.. లాక్ డౌన్ తరువాత ఫైనల్‌ ప్రకటన వుంటుందని సమాచారం. 
 
సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమా కోసం 50 కోట్లకి పైగా బడ్జెట్ కేటాయించనున్నట్టు తెలుస్తుంది. కైరా, ప్రభాస్ కెమిస్ట్రీ బాగా సూటవుతుందని.. సాహో తర్వాత సూపర్ హిట్ మూవీగా ఇది ప్రభాస్ కెరీర్‌లో నిలిచిపోతుందని సినీ జనం అంటున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు

PUBG : పబ్‌జీతో పరిచయమైన వ్యక్తితో వివాహిత జంప్.. వెయ్యి కిలోమీటర్ల జర్నీ

West Bengal Horror: లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Raj Tarun, Lavanya: లావణ్యకు బిగ్ షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ఏంటది?

Bengaluru : ఫ్రెండ్స్‌తో గొడవ.. రీల్స్ చేద్దామని 13 అంతస్థుకు వెళ్లింది.. జారిపడి యువతి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments