Webdunia - Bharat's app for daily news and videos

Install App

60 రోజులు... రూ.90 కోట్లు : ప్రభాస్ యాక్షన్ ఘట్టం ఖర్చు...

యూనివర్శల్ స్టార్ ప్రభాస్ "బాహుబలి" చిత్రం తర్వాత నటిస్తున్న చిత్రం "సాహో". ఈ చిత్రం షూటింగ్ దుబాయ్‌లో జరుపుకుంటోంది. ఇక్కడ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ ఘట్టం కోసం హాలీవుడ్ ఫైట్

Webdunia
శుక్రవారం, 4 మే 2018 (15:42 IST)
యూనివర్శల్ స్టార్ ప్రభాస్ "బాహుబలి" చిత్రం తర్వాత నటిస్తున్న చిత్రం "సాహో". ఈ చిత్రం షూటింగ్ దుబాయ్‌లో జరుపుకుంటోంది. ఇక్కడ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ ఘట్టం కోసం హాలీవుడ్ ఫైట్ మాస్టర్లు పని చేస్తున్నారు. అయితే, ఈ ఫైట్ సన్నివేశాల కోసం ఏకంగా రూ.90 కోట్లను ఖర్చు చేస్తున్నారు. మొత్తం రెండు నెలల పాటు ఈ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
 
ఈ చిత్రం షూటింగ్‌లో భాగంగా, దుబాయ్‌ రహదారుల్లో ప్రభాస్‌పై ఛేజింగ్‌ దృశ్యాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ఫైట్‌ కోసం ఏకంగా 60 రోజులు కేటాయించారని తెలుస్తోంది. 'సినిమాలో చాలా కీలకమైన సన్నివేశంలో వచ్చే ఛేజింగ్‌ ఇది. అంతర్జాతీయ స్థాయిలో ఉండాలన్న ఆలోచనతో ఈ స్థాయిలో ఖర్చు పెడుతున్నాం' అని యూవీ క్రియేషన్స్‌కి చెందిన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 
 
కాగా, సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు రూ.300 కోట్లతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్‌కు ఏమాత్రం తగ్గకుండా నిర్మిస్తుండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments