Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సాహో' తర్వాత ప్రభాస్ వ్యవసాయం చేయడట.. ప్రేమకథలో నటిస్తాడట...

యంగర్ రెబెల్ స్టార్ ప్రభాస్ "బాహుబలి" తర్వాత నటిస్తున్న చిత్రం "సాహో". ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరో నెల రోజుల పాటు ఈ సినిమా ష

Webdunia
సోమవారం, 25 జూన్ 2018 (16:48 IST)
యంగర్ రెబెల్ స్టార్ ప్రభాస్ "బాహుబలి" తర్వాత నటిస్తున్న చిత్రం "సాహో". ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరో నెల రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ 'అబుదాబి'లో జరుగనుంది. ఇదిలావుంటే, సాహో తర్వాత తదుపరి నటించేందుకు ఎలాంటి ప్రాజెక్టుకు ప్రభాస్ సంతకం చేయలేదు.
 
దీంతో 'సాహో' తర్వాత ఏం చేస్తారని ప్రభాస్‌ను మీడియా మిత్రులు ప్రశ్నించారు. దీనికి సమాధానమిస్తూ, ఈ చిత్రం షూటింగ్ తర్వాత ఏ వ్యాపారమో... వ్యవసాయమో చేసుకుంటానని చమత్కరించాడు. అయితే, సాహో షూటింగ్‌లో ఉండగానే ప్రభాస్ మరో చిత్రంలో నటించనున్నాడు. 
 
సాహో తర్వాత 'జిల్' మూవీ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాను ప్రకటించిన దగ్గర నుంచి.. కథా వస్తువు ఏమై వుంటుందనే ఆసక్తి అందరిలోనూ పెరుగుతూ పోతోంది.
 
1970 నేపథ్యంలో సాగే ఒక ప్రేమకథగా ఈ సినిమా రూపొందనుందనేది తాజా సమాచారం. ప్రస్తుతం ఆ కాలానికి సంబంధించిన సామాజిక వాతావరణాన్ని ప్రతిబింభించే సెట్స్‌ను కళాదర్శకుడు రవీందర్ తీర్చిదిద్దుతున్నారట. 
 
లవ్.. యాక్షన్.. ఫాంటసీ కలగలిసిన ఈ సినిమా చిత్రీకరణ కొంతభాగం యూరప్‌లో జరగనున్నట్టు సమాచారం. పూజా హెగ్డే కథానాయికగా నటించే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆగస్టులో మొదలుకానుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలులో ఎమ్మెల్యేకు సీటు ఇవ్వలేదని ప్రయాణికుడిని చితక్కొట్టారు... (Video)

బాలికతో స్నేహం.. బెదిరించి న్యూడ్ వీడియోలు తీసి ఫ్రెండ్స్‌కు షేరింగ్...

భర్తను కాదని మేనల్లుడిని పెళ్లి చేసుకుంది.. కూతురు అతనితోనే వుంటుంది.. (video)

NEET ప్రాక్టీస్ టెస్టులో తక్కువ మార్కులొచ్చాయని కుమార్తెను చంపేసిన తండ్రి

Pawan Kalyan: మధురైలో మురుగ భక్తర్గల్ మానాడులో పవన్ కల్యాణ్- ఫోటోలు, వీడియోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments