Webdunia - Bharat's app for daily news and videos

Install App

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

ఠాగూర్
మంగళవారం, 3 జూన్ 2025 (08:28 IST)
పపర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటించిన తాజా చిత్రం "హరిహర వీరమల్లు". ఈ నెల 12వ తేదీన విడుదలకానుంది. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం. నిర్మాత ఏఎం రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మించారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగాన్ని జూన్ 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు. 
 
దీన్ని పురస్కరించుకుని చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 8వ తేదీన తిరుపతిలో ఎస్వీ యూనివర్శిటీలో ఉన్న తారకరామా క్రీడా మైదానంలో ఈ నెల 8వ తేదీన వేడుక నిర్వహించనున్నారు. ఇందుకోసం 7వ తేదీ రాత్రి హీరో పవన్ కళ్యాణ్ తిరుపతికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంది. 
 
నిజానికి ఈ చిత్రానికి తొలుత దర్శకత్వ బాధ్యతలు చేపట్టింది క్రిష్ జాగర్లమూడి. అయితే ప్రాజెక్టుకు ఎక్కువ సమయంపట్టడంతో ఆయన ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఆయ స్థానంలో ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ ఆ బాధ్యతలు తీసుకున్నారు. ఎపుడో ప్రారంభమైన ఈ చిత్రం కోవిడ్‌తో పాటు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడం, ఇలా అనేక కారణాల వల్ల చిత్రం విడుదలలో జాప్యం నెలకొంది. మే నెలలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసిన పవన్ ఇపుడు.. ఆ తర్వాత డబ్బింగ్‌ను కేవలం నాలుగు గంటల్లో పూర్తి చేశారు. ఇందులో బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ వంటి వారు కీలక పాత్రలను పోషించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తలపై కాల్పులు జరిపిన ప్రేమికుడు.. నన్ను కాదని అతడితో వెళ్తావా?

జమ్మూకాశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ?వార్తలను ఖండించిన సీఎం ఒమర్

తిరుమల బాల గంగమ్మ ఆలయం వద్ద చిరుత సంచారం.. పిల్లి చిక్కలేదు (video)

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం : గాల్లో కలిసి ముగ్గురి ప్రాణాలు

Bhadradri: హైటెన్షన్ విద్యుత్ తీగలు బైక్‌కు తగిలి ఓ వ్యక్తి సజీవ దహనం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం