Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Advertiesment
A.M. Ratnam ticket price letter submit to   Bharat Bhushan

దేవీ

, సోమవారం, 2 జూన్ 2025 (16:05 IST)
A.M. Ratnam ticket price letter submit to Bharat Bhushan
ఇంతకుముందు సినిమా టికెట్ ధరలు పెంచాలంటే నేరుగా మంత్రిత్వశాఖను సంప్రదించడం నిర్మాత, దర్శకులు ఆనవాయితీ. కానీ ఆంధప్రదేశ్ లో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన సరరణ వల్ల ఫిలింఛాంబర్ కు పెద్ద పీట వేశారు. అందుకు  అగుగుణంగానే నేడు హరిహరవీరమల్లు నిర్మాత ఎ.ఎం. రత్నం హైదరాబాద్ లో ఛాంబర్ కు వచ్చారు.
 
నిర్మాత ఎ.ఎం. రత్నం గారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భరత్ భూషణ్ గారిని కలిసి, జూన్ 12న విడుదల కానున్న  హరిహరవీరమల్లు చిత్రం కోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక షోలకు టికెట్ ధర సవరణ మరియు ఆమోదం కోరుతూ అధికారికంగా అభ్యర్థన లేఖను సమర్పించారు.
 
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి  మార్గదర్శకత్వంలో ఈ చర్య తీసుకోబడింది, ఆయన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ద్వారా సరైన ప్రోటోకాల్ ద్వారా అభ్యర్థనను పంపాలని సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన