గుండ్లపాడును ఫ్యాక్షన్ భూతం వెంటాడుతుంది. ఇప్పటికే ఆ గ్రామంలో 18 హత్యలు జరిగాయి. కానీ ఒక్క కేసుకు మాత్రమే శిక్షపడింది. మాచర్ల నియోజకవర్గంలోనే అత్యంత సమస్యాత్మక గ్రామంగా ఇప్పటికీ ఫ్యాక్షనిజం పేట్రేగుతున్న గ్రామం వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడు. ఇటీవలి జంట హత్యలతో అది మరోసారి నిరూపితమైంది.
ఈ హత్యాకాండల్లో ఎక్కువగా నష్టపోయింది టీడీపీ వారే. 1987లో జడ్పీటీసీ ఉప ఎన్నిక తర్వాత జరిగిన ఓ ఘటనతో ఘర్షణలు ప్రారంభమయ్యాయని పోలీసు రికార్డులు చెబుతున్నాయి.
1989 నుంచి గుండ్లపాడులో ప్రశాంతత కరువైంది. ఈ నేపథ్యంలో 1990లో రెండు గ్రూపుల మధ్య గొడవల్లో మూడు హత్యలు చోటుచేసుకున్నాయి. కేసులు నమోదు చేసిన పోలీసులు 9 మందిని రిమాండ్కు పంపారు. 2014లో తెలుగుదేశం పార్టీకి చెందిన తోట వెంకట నరసయ్యను వైఎస్సార్సీపీకి చెందిన తొమ్మిది మంది పొలంలో కత్తులతో నరికి దారుణంగా హతమార్చారు.
2022లో తోట చంద్రయ్యపై వైఎస్సార్సీపీకి చెందిన చింత శివరామయ్య, మరో ఏడుగురు కత్తులతో దాడి చేసి అందరూ చూస్తుండగానే హతమార్చారు. ఇటీవల గ్రామానికి చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావులను ప్రత్యర్థులు చంపేశారు. ఇలా గుండ్లపాడులో రక్తపాతం కొనసాగుతూనే ఉంది.