రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. బైపాస్ రోడ్లపై అతివేగం కారణంగా, అలాగే మందేసి వాహనాలను నడపటం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతుంది. తాజాగా మద్యం మత్తులో ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
నంద్యాల జిల్లా నందికొట్కూరు హైవేపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. టిప్పర్ లారీ అదుపు తప్పి బైకు పైకి దూసుకెళ్లింది. ఈ ఘటన వాహనదారులు తీవ్రంగా గాయపడ్డారు.
నంద్యాల జిల్లా నందికొట్కూరు హైవేపై రోడ్డుకు మరోవైపు వెళ్తున్న బైకును అదుపు తప్పిన టిప్పర్ ఢీకొంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, బైకర్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఎల్లా గౌడ్, రెహమాన్లుగా గుర్తించారు.
టిప్పర్ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడం వల్లనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.