టీడీపీ పాలిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. నిమ్మతోటలో పనిచేసే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. కత్తితో పొడిచి చంపేసిన తర్వాత కూడా కసి తీరకపోవడంతో మృతదేహాన్ని రెండు రోజులు పాటు ముక్కలు ముక్కలుగా నరికి, ఆ శరీర భాగాలను బోరుబావిలో పడేశాడు. ఈ దారుణ హత్య నెల్లూరు జిల్లా లింగసముద్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
లింగసముద్రం మండలం, జపాలవారి పాలెంకు చెందిన టీడీపీ నేత తోవూరి నరసింహం. ఈయనకు నిమ్మతోటవుండగా, అందులో బ్రహ్మయ్య అనే వ్యక్తి పని చేస్తున్నాడు. వీరిద్దరి ఏం జరిగిందో తెలియదుకానీ, నరసింహంను బ్రహ్మయ్య కత్తితో పొడచి హత్య చేశాడు.
ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి బావిలోపడేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నరసింహంను బ్రహ్మయ్య ఇంత దారుణంగా ఎందుకు హత్య చేశాడన్నది మిస్టరీగా మారింది. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులుకేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు. బోరుబావి వద్ద సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు.