Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీడీపీ నేతను కత్తితో పొడిచి.. శవాన్ని ముక్కలు నరికి....

Advertiesment
murder

ఠాగూర్

, సోమవారం, 2 జూన్ 2025 (09:52 IST)
టీడీపీ పాలిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. నిమ్మతోటలో పనిచేసే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. కత్తితో పొడిచి చంపేసిన తర్వాత కూడా కసి తీరకపోవడంతో మృతదేహాన్ని రెండు రోజులు పాటు ముక్కలు ముక్కలుగా నరికి, ఆ శరీర భాగాలను బోరుబావిలో పడేశాడు. ఈ దారుణ హత్య నెల్లూరు జిల్లా లింగసముద్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
లింగసముద్రం మండలం, జపాలవారి పాలెంకు చెందిన టీడీపీ నేత తోవూరి నరసింహం. ఈయనకు నిమ్మతోటవుండగా, అందులో బ్రహ్మయ్య అనే వ్యక్తి పని చేస్తున్నాడు. వీరిద్దరి ఏం జరిగిందో తెలియదుకానీ, నరసింహంను బ్రహ్మయ్య కత్తితో పొడచి హత్య చేశాడు. 
 
ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి బావిలోపడేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నరసింహం‌ను బ్రహ్మయ్య ఇంత దారుణంగా ఎందుకు హత్య చేశాడన్నది మిస్టరీగా మారింది. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులుకేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు. బోరుబావి వద్ద సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదనీ యువకుడు బలవన్మరణం...