Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపల పులుసంటే మహాయిష్టమంటున్న హీరోయిన్!

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (16:27 IST)
తనకు చేపల పులుసంటే మహాయిష్టమని టాలీవుడ్ హీరోయిన్ హంసానందిని చెబుతోంది. అలాగే టాలీవుడ్‌లో కేవలం హీరోయిన్‌గా మాత్రమేకాకుండా 'లౌక్యం' చిత్రం తరహాలో ఉన్న కామెడీ పాత్రలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు ఆమె ప్రకటించారు. 
 
మోడల్‌గా రాణిస్తూ వచ్చిన హంసా నందిని ఆ తర్వాత 'ఒక్కటవుదాం' అనే చిత్రం ద్వారా టాలీవుడ్ వెండితెరకు పరిచయమైన ఆమె... ఇప్పటివరకు 29 చిత్రాల్లో నటించింది. తన అసలు పేరు పూనం అని చెప్పుకొచ్చింది. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన 'రుద్రమదేవి' సినిమాలో మధునిక పాత్ర తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువచేసిందని చెప్పింది. 
 
పలు సినిమాలో హీరోయిన్‌గా, ప్రత్యేక గీతాలకు డ్యాన్సర్‌ను నటించిన తనకు గోపీచంద్‌ హీరోగా నటించిన 'లౌక్యం' సినిమాలో బ్రహ్మానందానికి భార్యగా చేసిన పాత్ర బాగా నచ్చింది. కామెడీ పండించే పాత్ర అది. అలాంటి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తా. అలాగే 'మిర్చి', 'అత్తారింటికి దారేది' చిత్రాలతో మంచిపేరు వచ్చిందని చెప్పింది. 

సంబంధిత వార్తలు

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సింగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments