Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈషారెబ్బ కోలీవుడ్‌ సినిమాకు ఆ టైటిల్ ఖరారైందట..

Webdunia
మంగళవారం, 8 అక్టోబరు 2019 (11:21 IST)
ఈషారెబ్బ కోలీవుడ్‌లో రెండో సినిమాలో కనిపించనుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా‌లో హీరోయిన్ చెల్లెలి పాత్రలో కనిపించిన ఈషారెబ్బా.. తెలుగులో ప్రస్తుతం డమరకం ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ లో 'రాగల 24 గంటల్లో' అనే హారర్ థ్రిల్లర్‌లో నటిస్తుంది. ఈ  సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. 
 
దీంతో పాటు కోలీవుడ్‌లో జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా ప్రముఖ దర్శకుడు ఏజిల్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న చిత్రంలో ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రానికి 'ఆయిరం జన్మంగల్' (వెయ్యి జన్మలు) అనే టైటిల్ ఖరారు చేశారు. యువ హీరో విష్ణు విశాల్ ఈ టైటిల్‌ను రివీల్ చేశారు.
 
హారర్ కామెడీ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్నారై గర్ల్ నిఖిషా పటేల్, ప్రముఖ కమెడియన్ సతీష్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అభిషేక్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. కాగా ఈషా రెబ్బాకు తమిళంలో ఇది రెండో సినిమా. ఇంతకుముందు ఆమె 'ఓయ్' అనే చిత్రం తో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments