Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈషారెబ్బ కోలీవుడ్‌ సినిమాకు ఆ టైటిల్ ఖరారైందట..

Webdunia
మంగళవారం, 8 అక్టోబరు 2019 (11:21 IST)
ఈషారెబ్బ కోలీవుడ్‌లో రెండో సినిమాలో కనిపించనుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా‌లో హీరోయిన్ చెల్లెలి పాత్రలో కనిపించిన ఈషారెబ్బా.. తెలుగులో ప్రస్తుతం డమరకం ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ లో 'రాగల 24 గంటల్లో' అనే హారర్ థ్రిల్లర్‌లో నటిస్తుంది. ఈ  సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. 
 
దీంతో పాటు కోలీవుడ్‌లో జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా ప్రముఖ దర్శకుడు ఏజిల్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న చిత్రంలో ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రానికి 'ఆయిరం జన్మంగల్' (వెయ్యి జన్మలు) అనే టైటిల్ ఖరారు చేశారు. యువ హీరో విష్ణు విశాల్ ఈ టైటిల్‌ను రివీల్ చేశారు.
 
హారర్ కామెడీ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్నారై గర్ల్ నిఖిషా పటేల్, ప్రముఖ కమెడియన్ సతీష్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అభిషేక్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. కాగా ఈషా రెబ్బాకు తమిళంలో ఇది రెండో సినిమా. ఇంతకుముందు ఆమె 'ఓయ్' అనే చిత్రం తో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్-ఇజ్రాయేల్ దాడులు.. ఎయిరిండియా కీలక నిర్ణయం.. ఏంటది?

MP: పన్నా జిల్లాలో గనిని తవ్వుతుండగా 2.69 క్యారెట్ల వజ్రం

25న మధ్యాహ్నం 12.01 గంటలకు శుభాంశు శుక్లా రోదసీయాత్ర

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం : ఏపీలో విస్తారంగా వర్షాలు

హమ్మయ్య... ఢిల్లీకి చేరుకున్న ఏపీ విద్యార్థులు.. ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments