Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌భాస్ సినిమాకు తెలంగాణ ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్‌

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (18:57 IST)
Radheshyam poster
ప్రభాస్ అభిమానుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌కటించింది. ఈరోజే ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించింది.  రాధేశ్యామ్ ఈనెల 11న  అంటే రేపు భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. పాన్ ఇండియాగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇటీవ‌లే ఆంధ్ర‌లో టికెట్ రేట్ల గురించి ప్ర‌భాస్ కూడా ఎ.పి. ప్ర‌భుత్వాన్ని క‌లిశారు. ఇక తెలంగాణాలో క‌ల‌వ‌కుండానే సినిమా ప‌రిశ్ర‌మ‌కు కె.సి.ఆర్‌. ప్ర‌భుత్వం ఆఫ‌ర్లు ఇస్తుంది.  ఈ సినిమా ఐదో ఆటకు అనుమతిస్తూ ప్రభుత్వం అనుమతి జారీ చేసింది.
 
ఈ విష‌యాన్ని నిర్మాతలు తెలిపారు. మార్చి 11 నుంచి మార్చి 25వ తేదీ వరకు రాధేశ్యామ్ సినిమాకు ఐదో షో ప్రదర్శించుకోవచ్చని ప్ర‌భుత్వ‌ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యువీ క్రియేషన్స్ అధినేతలు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. జాత‌కాల నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందింది. రేప‌టినుంచి ప్ర‌భాస్ జాత‌కం ఎలా మారుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments