'వాల్తేరు వీరయ్య'గా చిరంజీవి.. బాస్ పార్టీకి ముహూర్తం ఖరారు

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2022 (18:31 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "వాల్తేరు వీరయ్య". ఈ చిత్రంలోని తొలి పాటను విడుదల చేసేందుకు మూహుర్తం ఖరారు చేశారు. 'బాస్ పార్టీ' పేరుతో ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4.05 గంటలకు ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నారు. బాస్ పార్టీకి అందరూ సిద్ధంగా ఉండండి అంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది. 
 
"వాల్తేరు వీరయ్య" చిత్రానికి బాబి దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. చిరంజీవి సరసన శృతిహాసన్, కేథరిన్‌ టెస్రాలు నటించారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా టైటిల్ సాంగ్‌లో నర్తించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొనివున్నాయి. 
 
గతంలో చిరంజీవి, డీఎస్పీ కాంబినేషన్‌లో వచ్చిన పలు చిత్రాల్లోని పాటలు సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెల్సిదే. దీంతో ఇపుడు "వాల్తేరు వీరయ్య"పై ఒక్కసారిగా అంచనాలు మిన్నంటయ్యీయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Aishwarya Rai: మానవాళికి సేవ చేయడంలోనే నిజమైన నాయకత్వం వుంది.. ఐశ్వర్యా రాయ్

మావోయిస్టు పార్టీకి దెబ్బమీద దెబ్బ - ఒక్కొక్కరుగా చనిపోతున్నారు...

అందుకే హెయిర్ కట్ చేసుకునేందుకు ఇష్టపడను.. పుట్టపర్తిలో సచిన్ కామెంట్స్

భారత్ పెద్ద మనసు వల్లే నా తల్లి ప్రాణాలతో ఉన్నారు : షేక్ హసీనా కుమారుడు

Sathya Sai Baba: సత్యసాయి బాబా సేవ, కరుణ మూర్తీభవించిన వ్యక్తి.. బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments