బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

ఠాగూర్
బుధవారం, 8 అక్టోబరు 2025 (16:58 IST)
బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి బాంబే హైకోర్టు గట్టి షాకిచ్చింది. ఓ వ్యాపారవేత్తను మోసం చేసిన కేసులో శిల్పాశెట్టి దంపతులు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విచారణ బాంబే హైకోర్టులో సాగుతోంది. శిల్పాశెట్టి దంపతులు దేశం విడిచి వెళ్లాలంటే రూ.60 కోట్లు డిపాజిట్ చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను పాటించిన తర్వాతే ఈ కేసు తదుపరి విచారణ కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. 
 
ముంబైకు చెందిన ఓ పారిశ్రామికవేత్తను రూ.60 కోట్ల మేరకు శిల్పాశెట్టి దంపతులు మోసం చేశారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతోంది. మరోవైపు వీరికి ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం లుకౌట్‌ నోటీసులు(ఎల్‌వోసీ) జారీ చేసింది. ఈ క్రమంలో శిల్పాశెట్టి దంపతులు విదేశీ పర్యటనకు వెళ్లడానికి అనుమతి కోరుతూ బాంబే హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తాజాగా కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. 
 
విదేశాలకు వెళ్లేందుకు నటి శిల్పాశెట్టి దంపతులకు అనుమతి నిరాకరించింది. ఒకవేళ దేశం విడిచి వెళ్లాలంటే ముందు రూ.60 కోట్లు డిపాజిట్‌ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను పాటించిన తర్వాత తదుపరి విచారణ కొనసాగుతుందని తెలిపింది.
 
ఓ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహించే కార్యక్రమంలో భాగంగా శిల్పాశెట్టి అక్టోబరు 25-29 తేదీల మధ్యలో కొలంబో వెళ్లాల్సి ఉంది. లుకౌట్‌ నోటీసులు ఉన్న నేపథ్యంలో ఆమె కోర్టును ఆశ్రయించారు. ‘ఈవెంట్‌ నిర్వాహకుల నుంచి ఏమైనా ఆహ్వానం ఉందా?’ అని కోర్టు శిల్ప లాయర్‌ను ప్రశ్నించగా, ప్రస్తుతం కేవలం ఫోన్‌కాల్‌ ద్వారా మాత్రమే సమాచారం తెలియజేశారని, కోర్టు అనుమతి ఇస్తే, అధికారికంగా ఆహ్వానం అందుతుందని తెలిపారు. అయితే, కోర్టు మాత్రం రూ.60 కోట్లు డిపాజిట్ చేసిన తర్వాత దేశం విడిచి వెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ ప్రారంభానికి రెండేళ్లు పట్టే అవకాశం..

డిసెంబర్ 4 నుండి రెండు రోజుల పాటు భారత పర్యటనలో పుతిన్

మా ఫ్రెండ్స్‌తో ఒక్క గంట గడిపి వాళ్ల కోర్కె తీర్చు, ఏపీ మహిళా మంత్రి పీఎ మెసేజ్: మహిళ ఆరోపణ (video)

అమరావతి నిర్మాణానికి భూములిచ్చి రైతులు త్యాగం చేశారు.. నిర్మలా సీతారామన్

ఇకపై ఇంటి వద్దే ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్‌డేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments