Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాలో సంగతి సరే... నిజంగా హీరోయిన్‌కి ఎన్ని పుట్టుమచ్చలున్నాయో చూసావా? విలేకరి వెకిలి ప్రశ్న

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (11:42 IST)
విలేకరులు ఎలాంటి ప్రశ్నలు వేయాలి? మీడియా సమావేశంలో ఎలా ప్రవర్తించాలన్నది చాలామందికి తెలియకుండా పోతుంది. కొందరైతే హీరోహీరోయిన్లకు వెకిలి ప్రశ్నలు వేస్తూ వారి స్థాయిని దిగజార్చుకుంటున్నారు.

 
ఇక అసలు విషయానికి వస్తే... డీజే టిల్లు చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న నేహాశెట్టి పట్ల ప్రముఖ విలేకరి వెకిలి ప్రశ్న వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బుధవారం నాడు హైదరాబాదులో చిత్ర యూనిట్ ట్రెయిలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర హీరోయిన్ నేహాశెట్టి గురించి ఇబ్బందికరమైన ప్రశ్నను సంధించాడు ఓ విలేకరి.

 
డీజే టిల్లు ట్రైలర్లో హీరోయిన్‌కి హీరో ఓ ప్రశ్న వేస్తాడు. నీకు ఎన్ని పుట్టుమచ్చలున్నాయని అడిగితే... పదహారు అంటూ జవాబిస్తుంది. ఈ డైలాగును ఆసరా చేసుకున్న ఓ జర్నలిస్ట్... హీరోయిన్‌కి నిజంగా ఎన్ని పుట్టుమచ్చలున్నాయో తెలుసుకున్నారా..? అంటూ హీరోని ప్రశ్నిస్తూ వెకిలి నవ్వు నవ్వాడు.

 
దీనిపై హీరో ఇబ్బందిపడుతూ... దీన్ని అవాయిడ్ చేద్దామంటూ సమాధానం చెప్పారు. ఐతే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హీరోయిన్ నేహాశెట్టి సదరు జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో స్పందించింది. చిత్ర నిర్మాత సారీ చెప్పారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments