Webdunia - Bharat's app for daily news and videos

Install App

#F2కి సీక్వెల్ రానుంది.. వెంకటేష్ ఏం చెప్పారంటే?

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (11:18 IST)
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా గత ఏడాది సంక్రాంతికి వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ సినిమా ఎఫ్2 భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లు గా తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. 
 
అంతకముందు మంచి కమర్షియల్ ఎంటెర్టైనర్లు చేసి ప్రేక్షకులను అలరించిన అనిల్ రావిపూడి, తొలిసారిగా ఈ సినిమాతో పూర్తి కామెడీ ఎంటర్టైనర్‌ని తెరకెక్కించారు. ఈ సినిమాకు సీక్వెల్ తీస్తాను అని అప్పట్లో దర్శకుడు అనిల్ చెప్పారు. 
 
ఈ వ్యాఖ్యలపై విక్టరీ వెంకటేష్ తాజాగా స్పందించారు. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా పనులతో బిజీగా ఉన్న దర్శకుడు అనిల్, ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పై త్వరలో పనిచేయనున్నారని, అలానే ఈ సినిమాలో తనతో పాటు మరొక్కసారి వరుణ్ తేజ్ కూడా నటించబోతున్నట్లు వెంకీ చెప్పారు.
 
అయితే హీరోయిన్లుగా తమన్నా, మెహ్రీన్ నటిస్తారా లేక వారి స్థానంలో మరొకరు ఉంటారా అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం అని, అలానే ఈ సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లోనే తెరకెక్కనున్నట్లు వెంకటేష్ వెల్లడించారు. ఇక ఈ వార్తతో వెంకీ, మెగా ఫ్యాన్స్ మరొక్కసారి పండగ చేసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments