Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా సేవా కార్యక్రమాలకు చిరంజీవి స్ఫూర్తి : హీరో సూర్య

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (13:50 IST)
తమిళనాట తాను చేపట్టిన సేవా కార్యక్రమాలకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవే స్ఫూర్తి అని కోలీవుడ్ హీరో సూర్య వెల్లడించారు. ఆయన నటించిన తాజా చిత్రం "ఈటీ". ఈ నెల 10వ తేదీన విడుదలవుతుంది. ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించగా పాండిరాజ్ దర్శకత్వం వహించారు. సన్ టీవీ అధినేత కళానిధి మారన్ తన సొంత నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. 
 
ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రిరిలీజ్ ఈవెంట్ గురువారం రాత్రి హైదరాబాద్ నగరంలో జరిగింది. ఇందులో హీరో సూర్య మాట్లాడుతూ, తాను తెలుగు వాళ్ళలో ఒకడిగా భావిస్తున్నట్టు చెప్పారు. తెలుగు ప్రేక్షకులను కలిసి దాదాపు రెండున్నరేళ్లు అయిందన్నారు. తన ఫ్యాన్స్‌కు, ఈటీ సినిమా బృందానికి ధన్యవాదాలు అని అన్నారు.
 
స్వచ్చంధ సేవా రంగంలో మెగాస్టార్ చిరంజీవి తనకు స్ఫూర్తి అని సూర్య ఈ సందర్భంగా గుర్తుచేశారు. చిరంజీవి బ్లడ్‌‍ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా అందిస్తున్న సేవల నుంచి తాను స్ఫూర్తి పొందానని, అందుకే "అగరం" పేరిట ఓ ఫౌండేషన్‌ను స్థాపించానని చెప్పారు. ఆ ఫౌండేషన్ ద్వారా తాను సేవలు అందిస్తున్నట్టు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments