Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై దృష్టిసారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (15:10 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో వెలుగుచూసిన మాదకద్రవ్యాల కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాలని ఈడీ నిర్ణయించింది. ఈ మేరకు కోర్టులో ఈడీ ఫిర్యాదు చేయడంతో ఈ అంశం మరోమారు చర్చనీయాంశంగా మారింది. 
 
గతంలో ఎక్సైజ్ శాఖ జరిగిన విచారణపై ఈడీ అధికారులు పూర్తి అసంతృప్తిని వ్యక్తం చేశారు. అందుకే మరింత లోతుగా దర్యాప్తు చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుని కోర్టుకు తెలిపినట్టు ఉన్నారు.
 
ముఖ్యంగా, డ్రగ్ ఫెడ్లర్‌తో సంబంధం ఉన్న వారి మొబైల్ కాల్ జాబితాను సేకరించి పరిశీలించాలని ఈడీ భావిస్తుంది. అంతేకాకుండా ఎక్సైజ్ అధికారుల వ్యవహారశైలిపై కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. 
 
కాగా, ఈ డ్రగ్స్ కేసులో ఇప్పటికే అనేక మంది ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా, హైదరాబాద్ నగరానికి చెందిన బడా పారిశ్రామికవేత్తలు, సినీ సెలెబ్రిటీల పేర్లు ఉన్నాయి. అలాగే, మరికొందరు వ్యాపారులు హవాలా మార్గంలో నిధుల మళ్లింపుపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bride: పెళ్లి కూతురు పద్ధతిగా వుంటుంది అనుకుంటే.. ఇలా మందేసి, సిగరెట్ కాల్చింది..(video)

వంట సరిగ్గా వండలేదని కొబ్బరి తురుముతో భార్యను హత్య చేసేశాడు.. ఎక్కడ?

Cow attack: ఏపీలో ఆవుల దాడి.. ఒకరు మృతి.. మరొకరికి తీవ్రగాయాలు (video)

Iran: అమెరికాతో చర్చలు.. అవసరమైతే చూద్దాం... సయ్యద్ అబ్బాస్

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments