Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు షాకిచ్చిన ఈడీ

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (16:21 IST)
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తేరుకోలేని షాకిచ్చింది. ఆర్థిక నేరస్థుడు సుకేశ్ చంద్రశేఖర్ దోపిడీ కేసులో భాగంగా జాక్వెనిల్‌కు చెందిన 7.27 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను అటాచ్ చేసినట్టు ఈడీ అధికారులు తాజాగా ప్రకటించారు. 
 
ఈడీ అటాచ్ చేసిన వాటిలో రూ.7 కోట్ల మేరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. సుకేష్ చంద్రశేఖర్ రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో నిందితుడుగా ఉన్న విషయం తెల్సిందే. ఈయన నుంచి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అత్యంత ఖరీదైన బహుమతులు అందుకున్నట్టు సమాచారం. 
 
వీటిలో ప్రధానంగా ఖరీదైన వజ్రాలు, బ్రాస్‌లెట్స్, మినీ కూపర్, డిజైనర్ బ్యాగులు, జిమ్ సూట్‌లు, చెవిపోగులు వంటి అనేక కానుకలు ఉన్నాయి. ఈ బహుమతులను కేవలం జాక్వెలిన్‌కు మాత్రమే కాకుండా ఆమె కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఆమెకు చెందిన రూ.7.27 కోట్ల ఆస్తులను జప్తు చేశారు.

సంబంధిత వార్తలు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

గుర్తుపట్టలేని విధంగా ఇరాన్ అధ్యక్షుడి మృతదేహం? అక్కడ తోడేళ్లు వున్నాయట

వారంలో ఎక్కువ రోజులు కెఫీన్ తాగుతున్న యువత..

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments